Don't Miss!
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- News ఎన్నికల వేళ ఆలీ కీలక నిర్ణయం..!!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
మోసగాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్.. మంచు విష్ణు కెరీర్ లోనే బిగెస్ట్ టార్గెట్.. ఇన్సూరెన్స్ కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ప్రాజెక్టులు ఏ స్థాయిలో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సౌత్ సినిమాలకు నార్త్ ఆడియెన్స్ కూడా ఈ మధ్య బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక మోసగాళ్ళు సినిమా కూడా ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద సినిమా టార్గెట్ పెద్దగానే ఉంది. సినిమా హిట్ అవ్వాలి అంటే మొదటి రోజే పాజిటివ్ టాక్ రావాలి. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే..
రియల్ స్టోరీ ఆధారంగా
మంచు విష్ణు మొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మోసగాళ్ళు సినిమా బిగెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా రూపొందింది. ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి అమెరికా జనాలను ఎలా మోసం చేశారు అనే పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. ఈ రియల్ స్టోరీపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
బడ్జెట్ ఎంతంటే..
జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేశారు. సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విష్ణు తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమాను నిర్మించాడు. మంచు విష్ణు కెరీర్ లో ఇంతవరకు ఈ స్థాయిలో ఏ సినిమా రిలీజ్ కాలేదు. పైగా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. సినిమా కోసం మొత్తంగా 50కోట్ల వరకు ఖర్చు చేశారు.
సొంతంగా రిలీజ్ చేసుకుంటున్న విష్ణు
కాజల్ ఈ సినిమాలో మంచు విష్ణు సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవదీప్ వంటి వాళ్ళు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం వలన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని అనుకున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమా టార్గెట్ ఎంతంటే..
మోసగాళ్ళు సినిమా అన్ని భాషల్లో కలుపుకొని నాన్ థియేట్రికల్ గా 30కోట్ల వరకు అంధించినట్లు తెలుస్తోంది. ఓటీటీ, శాటిలైట్ ఇలా అన్ని దారుల్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20కోట్లు అని టాక్ వస్తోంది. 20కోట్లు అందుకుంటే నిర్మాతగా మంచు విష్ణు సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
Recommended Video
ఇన్సూరెన్స్ కూడా
ఇక సినిమా కోసం మంచు విష్ణు ముందు జాగ్రత్తగా ఇన్సూరెన కూడా చేయించాడు. పెట్టిన బడ్జెట్ లో 20శాతం వరకు ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఈ సినిమా అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో డీ సీక్వెల్ తో బిజీ కానున్నట్లు విష్ణు చెప్పాడు. ఆ సినిమా కథ కోసం శ్రీను వైట్ల చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నట్లు వివరణ ఇచ్చారు.