Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాణా సినిమా ఫ్లాఫ్..ప్రభాస్ సినిమా హిట్ (ట్రేడ్ టాక్)
ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్ లో దశరథ్ రూపొందించిన 'మిస్టర్ పర్ఫెక్ట్" చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దిల్"రాజు నిర్మించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత హిట్ గా సెటిలైంది. దానికి తోడు దిల్ రాజు మొదలెట్టిన పబ్లిసిటి సినిమాకు కొంత అంచనాలను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి. ఇక ఈ చిత్రంతో పాటు బాలాదిత్య, రూపాశ్రీ జంటగా వివివి సత్యనారాయణ దర్శకత్వంలో లక్ష్మీనారాయణ డొల్లా నిర్మించిన 'నిన్ను చేరాలని" కూడా విడుదలయింది. అయితే బాలాదిత్య హీరోగా చేసిన 'నిన్ను చేరాలని" చిత్రం మాత్రం ప్రేక్షకులను చేరలేకపోయింది. ఈ రెండు చిత్రాలతో పాటు మరో బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్" ప్రేక్షకుల ముందుకొచ్చింది. లీడర్ తో తెలుగు తెరకు పరిచయమైన రాణా హీరోగా చేసిన ఈ ధ్రిల్లర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలకపోయింది. నెగిటివ్ రివ్యూలతో, మౌత్ టాక్ తో మొదటి రెండు రోజులకే ధియోటర్స్ ఖాళీ అయ్యాయి. దీపికా పదుకోని ఐటం సాంగ్ కూడా సినిమాను ఏ మాత్రం నిలబెట్టలేకపోయింది.