Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సిద్దార్ద స్వయంగా తనే సినిమాని చంపేసాడు
హైదరాబాద్ : వరస ఫ్లాఫుల్లో ఉండి శాటిలైట్ మార్కెట్ తప్ప థియోటర్ మార్కెట్ చాలా తగ్గిపోయిన హీరో ఎవరూ అంటే సిద్దార్ద అని చెప్పాలి. అయితే అతనికి మీడియాతో తగువులు రావటం కారణమో, లేక సరైన సినిమాలు పడకపోవటమే ఈ స్ధితికి కారణం. నిన్న(శుక్రవారం) అతని చిత్రం తమిళంలో విజయవంతమైన ‘ఎనకుల్ ఒరువన్' చిత్రాన్ని తెలుగులో ‘నాలో ఒకడు'గా రిలీజైంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సిద్ధార్థ్, దీపసన్నిధి జంటగా ప్రసాద్ రమర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఓపినింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా థియోటర్లలో కనీసం ఇరవై మంది కూడా లేరు. దానికి కారణం..సిద్దార్ధ పబ్లిసిటీ క్యాంపయిన్ లో పాల్గొనకపోవటమే అంటున్నారు. తన సినిమాపై తనకే శ్రద్ద లేకుండా పోవటంతో తన చేతులతో తనే చంపేసినట్లైందని ట్రేడ్ లో వినపడుతోంది.
ఉన్నంతలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడవటమే కొంతలో కొంత ఊరట. మా టీవి వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 75 లక్షలు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం.
సిద్ధార్థ మాట్లాడుతూ.... రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా నవ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నా పాత్ర తీరుతెన్నులు వైవిధ్యంగా వుంటాయి. నాకు తెలుగు చిత్రసీమతోనే అనుబంధం ఎక్కువగా వుంది. నేను ఇప్పటివరకు చేసిన 25 సినిమాల్లో 12 తెలుగు చిత్రాలే. బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాల తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలు చేయలేకపోయాను. వచ్చే ఏడాది తెలుగులో రెండు పెద్ద చిత్రాల్ని చేయబోతున్నాను అన్నారు.
వినూత్న కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించామని, తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిదని దర్శకుడు ప్రసాద్ రమర్ తెలిపారు. ఉదయ్మహేష్, అజయ్త్న్రం, యోగి, మహదేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్నారాయణ్, నిర్మాత: ప్రకృతి, దర్శకత్వం: ప్రసాద్ రమర్.