నాగ చైతన్య ‘దోచేయ్' నష్టం ఎంత? (టోటల్ కలెక్షన్స్ )
హైదరాబాద్ :నాగచైతన్య హీరోగా కృతి సనన్ హీరోయిన్గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుని రిలీజైన చిత్రం ‘దోచేయ్' . రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. పతాకంలో బి.వి.ఎస్. ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగచైతన్య కెరీర్లో మరో బ్లాక్బస్టర్ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది అని భావించి విడుదల చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఫ్రభావం ఓవరాల్ కలెక్షన్స్ పై పడింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.... దాదాపు 14 కోట్ల రూపాయలకు అమ్ముడైన ఈ చిత్రం...కేవలం ఏడు కోట్లు వద్ద కలెక్షన్స్ ఆగిపోవటం డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్ర నిరాశను కలిగించింది.

ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దోచెయ్...టోటల్ కలెక్షన్స్ (షేర్)
నైజాం : Rs 2.28 కోట్లు
సీడెడ్ : Rs 0.72 కోట్లు
ఉత్తరాంధ్ర: Rs 0.55 కోట్లు
గుంటూరు: Rs 0.47 కోట్లు
కృష్ణా: Rs 0.37 కోట్లు
తూర్పు గోదావరి : Rs 0.40 కోట్లు
పశ్చిమ గోదావరి : Rs 0.31 కోట్లు
నెల్లూరు: Rs 0.20 కోట్లు
దోచేయ్ ఎపి& నైజాం టోటల్ కలెక్షన్స్ : Rs 5.3 కోట్లు
దోచేయ్ ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : Rs 6.75 కోట్లు (ఇందులో కర్ణాటక: Rs 0.80 కోట్లు; భారత్ లో మిగిలిన ప్రాంతాలు: Rs 0.25 కోట్లు; ఓవర్ సీస్ : Rs 0.40 కోట్లు).
బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., ఫొటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సహ నిర్మాత: భోగవల్లి ప్రసాద్.


Click it and Unblock the Notifications











