Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అలా మాట్లాడితే ఇంకే ఓపినింగ్స్ వస్తాయి?
హైదరాబాద్ : మా సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు..మా సినిమా లో ఫలానా హీరోయిన్ ఐటం సాంగ్ చేసింది... ఫలానా లొకేషన్ లో షూట్ చేసాం వంటి విషయాలు సాధారణంగా...రిలీజ్ కు ముందు ఆసక్తి రేపటానికి దర్శక,నిర్మాతలు, హీరో ఊరిస్తూ చెప్తూంటారు. అయితే తాజాగా విడుదలకు సిద్దమైన 'జెండాపై కపిరాజు' చిత్రం హీరో నాని మాత్రం తన చిత్రం సమాజానికి సందేశాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ రోజుల్లో... మా సినిమాలో సందేశం ఉందీ అంటే జనం ఆ థియోటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. మరి ఈ విషయం తెలియకనా నాని చెప్తున్నారు...లేదా కొత్త తరహాలో తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలన్న ఉత్సాహంతో చెప్తున్నారో అర్దం కావటం లేదు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నాని, అమలాపాల్, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జెండాపై కపిరాజు'. పి.సముద్రఖని దర్శకుడు. రజత్ పార్థసారథి, కె.ఎస్.శ్రీనివాసన్ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా యూనిట్ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
నాని మాట్లాడుతూ ''మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం సరైన స్థితిలో ఉంటుందనే అంశంపై నడిచే సినిమా ఇది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమాలో మూడు నిమిషాలు ఉండే పోరాట సన్నివేశాన్ని 24 రోజులు చిత్రీకరించాం. ఇప్పుడు దాన్ని తెరపై చూసుకుంటే ఆ కష్టమంతా మరచిపోయాను''అని చెప్పారు.
''తెలుగు తెరపై త్వరలో ఓ మంచి సినిమాను విడుదల చేయబోతున్నాం. జీవీ ప్రకాష్కుమార్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాణ సంస్థకు చెందిన మల్టీడైమన్షన్ వాసు.
వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్, శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధన్రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్, కూర్పు: ఫాజల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్.