Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Check Closing collections: ముగిసిన నితిన్ పోరాటం.. సినిమాకు వచ్చిన నష్టం ఎంతంటే?
కమర్షియల్ సినిమాలతో ఎక్కువగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న నితిన్ చాలా రోజుల తరువాత చేసిన ప్రయోగాత్మకమైన చిత్రం చెక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక మొత్తానికి బాక్సాఫీస్ వద్ద నితిన్ పోరాటం ముగిసింది. సినిమా బిజినెస్, అలాగే ఎంతవరకు నష్టాలు వచ్చాయనే విషయంలోకి వెళితే..
డిఫరెంట్ సినిమాలను ట్రై చేయాలని
గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో చివరగా వచ్చిన బాక్సాఫీస్ హిట్ మూవీ భీష్మ. నితిన్ కెరీర్ లోనే అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాలో అది కూడా ఒకటి. అంతకుముందు వరకు కొన్ని అపజయాలను చూసిన నితిన్ మొత్తానికి భీష్మతో కమర్షియల్ హిట్ కొట్టాడు. ఇక వరుస సినిమాలను లైన్ లో పెట్టిన నితిన్ మధ్యలో కాస్త డిఫరెంట్ సినిమాలను ట్రై చేయాలని చెక్ సినిమా చేశాడు.
మిక్సీడ్ టాక్ తెచ్చుకోవడంతో
విభిన్నమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా గట్టిగానే జరిగింది. అయితే సినిమా మిక్సీడ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ అనుకున్నంత రాలేదు.
ఫస్ట్ వీకెండ్ లోనే..
చెక్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో మాత్రమే కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టి ఆ తరువాత పూర్తిగా నిరాశపరిచింది. చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి శుక్రవారం 3.38కోట్ల షేర్స్ అందుకున్న చెక్ పెద్దగా పాజిటివ్ టాక్ అందుకోలేకపోయింది. ఆ తరువాత శని ఆదివారాలు కనీసం రెండు కోట్ల షేర్స్ కూడా రాలేదు.
మొత్తం వచ్చిన షేర్స్..
ఇక నాలుగవ రోజు నుంచి సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గుతూ వచ్చాయి. ఫైనల్ గా 13రోజుల్లోనే సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేశాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 9.35కోట్ల షేర్స్ ను మాత్రమే రాబట్టింది. అయితే మూవీ 16కోట్ల బిజినెస్ చేయగా 16.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది.
నష్టం ఎంతంటే..
సినిమాకు వచ్చిన మొత్తం నష్టం ఎంతంటే 7.15కోట్లు. సినిమా ఈ స్థాయిలో నష్టపోతుందని ఎవరు ఊహీంచలేదు. ఇక ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక రంగ్ దే మార్చ్ 26న రిలీజ్ కాబోతోంది.