Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నితిన్ 'చెక్' బిజినెస్.. గట్టిగానే రాబడుతున్నాడు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేయడం కామన్. ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న ఈ హీరో గత భీష్మ సినిమాతో అయితే కెరీర్ లోనే మరో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుండా బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది.
ఇక భీష్మ అనంతరం రంగ్ దే సినిమాతో త్వరగానే రిలీజ్ చేయాలని అనుకున్నాడు. ఒక విధంగా రంగ్ దే సినిమాను చేస్తూనే మరో సినిమాను కూడా పూర్తి చేసి ఏడాది ఎండింగ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఈ ఫిబ్రవరి 26న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమా బిజినెస్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను 5.40కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ఏరియాలో కూడా డీల్ మంచి రేటుకే అమ్ముడైనట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ లోనే సినిమాను తేరకెక్కించారని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా పెట్టిన పెట్టుబడి చాలా వరకు వెనక్కి వచ్చినట్లు టాక్. అయితే లాక్ డౌన్ దెబ్బకు నితిన్ ప్లాన్ మొత్తం మారిపోయింది. దుబాయ్ లో ప్లాన్ చేసుకున్న పెళ్లితో పాటు సినిమా ప్లాన్స్ కూడా మార్చాల్సి వచ్చింది. రంగ్ దే సినిమా షూటింగ్ కు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్నట్లుగా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.