Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
50 కోట్ల భీష్మ.. కలెక్షన్ల సునామీ.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీష్మ'. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేశవిదేశాల్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ మూవీ 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్లాస్, మాస్ అన్ని సెంటర్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టి నేటికీ అదే జోరును కొనసాగిస్తోంది. దేశంలోనే గాక విదేశాల్లో సైతం భీష్మకు భారీ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన భీష్మ.. ఇంకా వసూళ్ల ప్రవాహాన్ని పారిస్తూనే ఉంది.
భీష్మ లాభాల బాట పట్టడంతో చిత్రయూనిట్ అంతా ఫుల్ ఖుషీ అవుతోంది. ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన యూనిట్ సభ్యులు.. ఫిబ్రవరి 29న గ్రాండ్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఇకపోతే దగ్గరలో గట్టి పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం కారణంగా ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు.