Don't Miss!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఎన్టీఆర్ 'దమ్ము' బిజెనస్ దమ్ము అంతా?
ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దమ్ము చిత్రం బిజెనెస్ అప్పుడే మొదలయ్యి దుమ్ము రేపుతున్నట్లు సమాచారం. సింహాతో ఘన విజయం సాధించిన బోయపాటి శ్రీను దర్శకుడు అవటం కమర్షియల్ గా ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.మరో ప్రక్క హాట్ హీరోయిన్ శృతి హాసన్ లీడ్ రోల్ చేయటం కూడా సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చి పెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్ సీస్,ఆధ్రాలోని చాలా ప్రాంతాల బిజెనెస్ అప్పుడే పూర్తై పోయింది. ప్రముఖ డిస్ట్ర్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్ ఈ చిత్రం కృష్ణా,గుంటారూ,నెల్లూరు రైట్స్ తీసుకన్నట్లు తెలుస్తోంది.అలాగే శ్రీ చరణ్ ఫిల్మ్ వారు ఏడు కోట్లు ని ఎన్ ఆర్ ఎ బేసిస్ లో తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఓవర్ సీస్ రైట్స్ ని దూకుడు చిత్రం తీసుకున్న ఫికస్ వారు రెండు కోట్ల పది లక్షలు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇక మిగతా ఏరియాలు కూడా మంచి రేటుతో బిజెనెస్ జరిగే అవకాసం ఉంది. ఇందుకోసం నిర్మాత కె ఎస్ రామారావు ఆఫీసులో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. ఊసరవెల్లి ఎఫెక్టు ఈ చిత్రం బిజెనెస్ పై అస్సలు పడకపోవటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.