Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంత ‘ఓ బేబీ’ దెబ్బకు ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్ చిత్రాలు విలవిల!
సమంత ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా పుంజుకున్నది. ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్లో కలెక్షన్ల పరంగా పూర్తిగా నీరసించి పోగా సెకండ్ వీకెండ్లో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తూ వసూళ్ల వర్షం కురిపించింది.
తొలి వారం వసూళ్లు పరిశీలిస్తే.... ఈ మూవీ 1 మిలియన్ మార్క్ అందుకోవడం అసాధ్యమని అనుకున్నారు. కానీ సెకండ్ వీకెండ్ వసూళ్లు చూసిన తర్వాత అది సాధ్యమే అనిపిస్తోంది. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో పాటు ఫన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కావడంతో అమెరికాలోని తెలుగువారు కుటుంబ సమేతంగా చూడటానికి ఇష్టపడుతున్నారు.
సెకండ్ వీకెండ్ 'ఓ బేబీ' మూవీ $140k వసూలు చేసింది. దీంతో టోటల్ వసూళ్లు $870k రీచ్ అయింది. త్వరలోనే 1 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. గతవారం విడుదలైన 'దొరసాని', 'నిను వీడని నీడను నేనే' చిత్రాల కంటే 'ఓ బేబీ' చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపారు.
ఆనంద్ దేవరకొండ-శివాత్మిక జంటగా నటించిన 'దొరసాని' యూఎస్ఏలోని తెలుగు ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో విఫలం అయింది. ఫస్ట్ వీకెండ్ కేవలం 10K మాత్రమే వసూలు చేసింది. సందీప్ కిషషన్ 'నిను వీడని నీడను నేనే' 16K రాబట్టింది.