Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సమంత ‘ఓ బేబీ’ పరిస్థితి ఏంటి? ఇంత వరకు ఎంత వసూలైంది?
సమంత ప్రధాన పాత్రలో నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుని మూడో వారం సైతం డిసెంట్ వసూళ్లతో రన్ అవుతోంది. తొలి రెండు వారాలు బాక్సాఫీసు వద్ద ఆధిపత్యం చూపిన ఈ మూవీ మూడో వారం ఇస్మార్ట్ శంకర్, లయన్ కింగ్ ఎఫెక్టుతో వెనకబడింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 38 కోట్ల గ్రాస్, 17కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టినట్లు సమాచారం. నిర్మాతలకు ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అని అంటున్నారు. ఇండస్ట్రీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని సూపర్ హిట్గా తేల్చేశారు.
మరో వైపు ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్లో కూడా సత్తా చాటింది. 1 మిలియన్ డాలర్ మార్కుకు దాటింది. ఒక్క యూఎస్ఏలోనే 9.5 లక్షల డాలర్లకుపైగా రాబట్టింది. మరో 50 వేల డాలర్లు వస్తే యూఎస్ఏలో కూడా 1 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉంది.
నైజాం ఏరియాలో అత్యధికంగా రూ. 4.61 కోట్ల షేర్ రాబట్టగా... ఉత్తరాంధ్రలో రూ. 1.75 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 1.50 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ ఏరియాలో రూ. 3.70 కోట్లు రాబట్టింది. మిగతా ఏరియాల్లో ఎక్కడా కూడా కోటి మార్కును అందుకోలేదు.
సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు.