twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టిక్కెట్లు అమ్మకంలో కొత్త రికార్డు క్రియేట్ చేసిన 'ఆరెంజ్'

    By Srikanya
    |

    రేపు(శుక్రవారం) విడుదల కానున్న రామ్ చరణ్ "ఆరెంజ్" చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియోట్ చేస్తోంది. టిక్కెట్ కౌంటర్స్ ఓపెన్ చేసిన రోజున్నరలోనే ఐదు లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడయ్యాయి. ఇది ఓ రికార్డుగా చెప్తున్నారు. మగధీర ఘన విజయం ఈ మాదిరి ఓపినింగ్స్ కు దారితీసిందని విశ్లేషిస్తున్నారు. అంతేగాక రామ్ చరణ్ ఈ చిత్రంలో మోడ్రన్ యూత్ కు ఐకాన్ ట్రెండ్ ని ఫాలో అవటం కూడా ఈ క్రేజ్ రావటానికి కారణమంటున్నారు. మరో ప్రక్క హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్టవటం కూడా సినిమాపై అంచనాలు పెంచి అమ్మకాలుపై ప్రభావం చూపాయని చెప్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మించిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. చిత్ర విజయంపై నాగబాబు బాగా నమ్మకంగా ఉన్నారు. మగధీర ఓ మేజిక్ అయితే, ఆరెంజ్ ఓ ఎక్స్‌పీరియెన్స్ అనాలి. ఖుషీ తరహాలో హాయిగా, రొమాంటిగ్గా సాగే సినిమా ఇది. చరణ్ ‌కి, భాస్కర్‌ కి ఇది మూడో చిత్రం. కచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అని నాగబాబు చెప్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X