Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పంతం కలెక్షన్ల జోరు.. ఇరుగదీస్తున్న గోపిచంద్.. కెరీర్లోనే..!
Recommended Video
మాస్ హీరో గోపిచంద్ బాక్సాఫీస్పై తన పంతం నెగ్గించుకొంటున్నారు. గోపిచంద్ కెరీర్లోనే రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకోవడం ట్రేడ్, క్రిటిక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సున్నితమైన రాజకీయ విమర్శనాస్త్రంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన పంతం చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నది. గత నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను పంతం సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది.
వరల్డ్ వైడ్ పంతం కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో రూ. 10.5 కోట్ల గ్రాస్, రూ.6.77 కోట్ల షేర్ను ఈ చిత్రం సాధించింది. మెహ్రీన్ ఫిర్జాదా, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందించింది. తొలి చిత్ర దర్శకుడు కే చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
పంతం చిత్రం ఆంధ్ర, తెలంగాణలో మంచి కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.6 కోట్ల షేర్ సాధించింది. ప్రాంతాల వారీగా చూసుకొంటే నైజాంలో రూ.1.96 కోట్లు, సీడెడ్లో రూ.1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.83 లక్షలు వసూలు చేసింది.
ఆంధ్రాలో రఫాడిస్తున్న గోపిచంద్
ఆంధ్రంలోని నెల్లూరులో రూ.26 లక్షలు, గుంటూరులో రూ.64 లక్షలు, కృష్ణా రూ.43 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. రూ.37.28 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.46.42 లక్షలు వసూలు చేసింది.
ఓవర్సీస్లో కుమ్మేస్తున్న పంతం
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగితా రాష్ట్రాల్లో కూడా పంతం భారీ వసూళ్లను సాధిస్తున్నది. చెన్నై, బెంగళూరుతోపాటు (రెస్టాఫ్ ఇండియా) మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.50 లక్షల కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్లో రూ. 25 లక్షలు వసూలు చేసింది.