Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజశేఖర్ కు రజనీకాంత్ అండ
హైదరాబాద్: అవును...ఇప్పుడు రాజశేఖర్ తాజా చిత్రం పట్టపగలు ప్రమోషన్ కి రజనీకాంత్ అవసరమొచ్చారు. అయితే రజనీకాంత్ వచ్చి ప్రమోట్ చేస్తాడనుకోకుండి. ఆయన తాజా చిత్రం విక్రమ్ సింహా తో పాటు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేద్దామని వీరి ప్లాన్. దాంతో రజనీకాంత్ కు ఉండే వీర పాలోయింగ్ తో ధియోటర్స్ నిండుతాయి కాబట్టి...తమ ట్రైలర్ ఎక్కువ మంది చూసే అవకాసం ఉందని భావిస్తున్నారు. అయితే ప్లాన్ వరకూ బాగానే ఉంది కానీ విక్రమ్ సింహ మీద అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎవరికీ ఈ చిత్రం పనులు అన్నీ మానుకుని చూసేంత ఆసక్తి కనపడటం లేదు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ పట్టపగలు చిత్రం చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. పూర్తి హర్రర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం జూన్ 6 వ తేదీన విడుదల చేయటానికి నిర్ణయం చేసారు.
ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి వరస సినిమాలు ప్రారంభించిన వర్మ... మొన్నీ మధ్య రౌడీ అంటూ ముందుకు వచ్చారు. మంచు కుటుంబ ప్యాకేజి చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. మంచు విష్ణు ..మీడియా ముందుకు వచ్చి..మా సినిమాకు బాగా డబ్బులొచ్చాయి అని చెప్పుకోవాల్సి వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ పెద్ద ఇంప్రెసివ్ లేవంటూ విమర్శలు బాగా వచ్చాయి. హర్రర్ జానర్ అనేది ఎక్కడా కనపడటం లేదని, ఈ సినిమాతో వర్మ అనుకున్న భయం తేగలగుతారా లేక వర్మ సినిమాలంటే ఉన్న భయం మరింత పెరుగుతుందా అనేది ఆసక్తికరంగా సినీ జనాలు ఎదురుచూస్తున్న అంశం.
హారర్
నేపథ్యంలో
సాగే
ఈ
సినిమాలో
పెళ్లికావాల్సిన
కూతురున్న
తండ్రిగా
రాజశేఖర్
నటిస్తున్నారు.
ఈ
పాత్ర
కోసం
మేకప్
లేకుండా,
రియల్
గెటప్లోనే
ఆయన
నటిస్తున్నారు.
'బ్రేకప్'లో
రణధీర్కి
జోడీగా
నటించిన
స్వాతి
దీక్షిత్
ఇందులో
రాజశేఖర్
కూతురి
పాత్రను
పోషిస్తోంది.
దాదాపు 15 రోజులు రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం ఫినిష్ చేసాడని,త్వరలోనే విడుదల చేస్తున్నాడని వినికిడి. ఈ మేరకు ఎడిటింగ్ వర్క్ సైతం పూర్తైందని అంటున్నారు. రాజ శేఖర్ సినిమాలు ఈ మధ్యన రావటం లేదు. వచ్చినా ఆడటం లేదు. చాలా స్లంప్ లో ఉన్న రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై క్రేజ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖరే నిర్మాత కావటం విశేషం.