Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Bheemla Nayak Total Collections: 108 కోట్ల టార్గెట్.. ఫుల్ రన్లో నిరాశే.. ఏకంగా అన్ని కోట్ల నష్టం
సుదీర్ఘమైన విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ను అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ మెగా హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్టీస్టారర్గా వచ్చిన ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటించాడు. ఇది కూడా భారీ అంచనాలతోనే విడుదలైంది. అయితే, కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కలెక్షన్లు అంతగా రాలేదు. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మూవీ అసలు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం పదండి!
క్రేజీ కాంబోలో ‘భీమ్లా నాయక్'
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు.
RRR Story: కథ లీక్ చేసిన రాజమౌళి తండ్రి.. రిలీజ్ ముందు రోజే బయటకొచ్చిన హైలైట్స్
ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
క్రేజీ కాంబోలో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చింది?
'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ముగింపు సమయానికి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 35.02 కోట్లు, సీడెడ్లో రూ. 11.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.65 కోట్లు, ఈస్ట్లో రూ. 5.49 కోట్లు, వెస్ట్లో రూ. 5.11 కోట్లు, గుంటూరులో రూ. 5.26 కోట్లు, కృష్ణాలో రూ. 4.29 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.84కోట్లు షేర్, రూ. 117.85 కోట్లు గ్రాస్ దక్కింది.
బెడ్పై బట్టల్లేకుండా హీరోయిన్: హాట్ వీడియో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో రూ. 76.84 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.24 కోట్లు, ఓవర్సీస్లో రూ. 12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ముగింపు సమయానికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.63 కోట్లు షేర్తో పాటు రూ. 159.10 కోట్ల గ్రాస్ వచ్చింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?
భారీ మల్టీస్టారర్గా రూపొందిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్లోనే రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 10.37 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది.
స్విమ్సూట్తో షాకిచ్చిన కాజల్: ప్రెగ్నెంట్ అయినా అందాలు ఆరబోస్తూ ఘాటుగా!
ఆ ప్రభావం వల్లే సినిమాకు నష్టం
'భీమ్లా నాయక్' మూవీకి అన్ని చోట్లా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది హవాను చూపించింది. కానీ, టార్గెట్ను మాత్రం రీచ్ కాలేకపోయింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండడం.. పైగా 'రాధే శ్యామ్' వంటి భారీ సినిమా వల్ల థియేటర్ల సంఖ్య కూడా తగ్గింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పొచ్చు.
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ స్టార్ట్
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీ నేటి నుంచే (మార్చి 24) స్ట్రీమింగ్ మొదలైంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఆహాలో ఒకేసారి మొదలు పెట్టారు. దీంతో చాలా థియేటర్లలో ఈ సినిమా రన్ ఆగిపోయింది. ఇక, ఓటీటీల్లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందులో కూడా ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.