Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ వెనకే ఎన్టీఆర్ వస్తున్నాడు...
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చిత్రం అత్తారింటికి దారేది విడుదలైన వారానికే ఎన్టీఆర్ తాజా చిత్రం రామయ్య వస్తావయ్యా చిత్రం విడుదలకు సిద్దమవుతోందని ట్రేడ్ టాక్. ఈ రెండు చిత్రాలు ఒకదానికి మరొకటి పోటీగా వస్తున్నాయి. రెండూ క్రేజీ ప్రాజెక్ట్సే కావటంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది. అందిన సమాచారం ప్రకారం అత్తారింటికి దారేది చిత్రం గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ 2న వస్తుంది. అలాగే రామయ్య వస్తావయ్యా చిత్రం అక్టోబర్ 10 న విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా సీజన్ ని ఇద్దరూ క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
రామయ్యా వస్తావయ్యా విషయానికి వస్తే... కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్బోయ్లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్శంకర్. నిర్మాత 'దిల్'రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటీవలే ఎన్టీఆర్, హంసానందినిపై ఓ ఐటమ్ సాంగ్ని చిత్రీకరించారు.
ఈ చిత్రం ఒక సన్నివేశం మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేసి, అక్టోబర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు.
కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.