Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
PelliSandaD దుమ్ము రేపుతున్న కలెక్షన్లు.. టాక్ తో సంబందం లేకుండా బ్రహ్మరధం?
తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దసరా సందర్భంగా విడుదల అయినా 'పెళ్లిసందD' సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ ఏడాది దసరా సందర్భంగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ముందుగా 14వ తారీకు సిద్ధార్థ, శర్వానంద్ హీరోలుగా రూపొందిన మహాసముద్రం సినిమా విడుదల కాగా 15వ తేదీన అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లిసందD' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాకు మూడు రోజుల పాటు వచ్చిన కలెక్షన్లు ఎలా ఉన్నాయి అనే విషయం పరిశీలిస్తే
మాంచి ప్రీ రిలీజ్
శ్రీకాంత్ కొడుకు రోషన్, తెలుగమ్మాయి శ్రీ లీల జంటగా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆమె శిష్యురాలు గౌరీ రోణంకి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు.
ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం సమకూర్చిన ఈ సినిమా దసరా సందర్భంగా 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పెళ్లిసందD' మూవీ ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు 5.5 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
టాక్ తో సంబంధం లేకుండా
దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఎక్కువగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ మౌత్ టాక్ రావడంతో పాటుగా రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ, మొదటి రోజు సాయంత్రం నుంచి సినిమా పుంజుకుని శనివారం కూడా మంచి కలెక్షన్లు కూడా సాధించింది.
'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాం రూ. 42 లక్షలు, సీడెడ్లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్లో రూ. 8 లక్షలు, వెస్ట్లో రూ. 7 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరు రూ. 6 లక్షలతో.. రెండో రోజు రూ. 1.26 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
మూడో రోజు కలెక్షన్లు
ఇక మూడో రోజు కూడా భారీ కలెక్షను రాబట్టింది ఈ సినిమా. నైజాం రూ. 31 లక్షలు, సీడెడ్లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 16 లక్షలు, ఈస్ట్లో రూ. 7 లక్షలు, వెస్ట్లో రూ. 6 లక్షలు, గుంటూరు రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరు రూ. 5 లక్షలతో.. మూడో రోజు రూ. 1.05 కోట్లు షేర్, రూ. 1.65 కోట్ల గ్రాస్ వచ్చింది.
మూడు రోజులకు కలిపి
మొదటి రోజు కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ మూడు రోజులకు కలిపి నైజాంలో 1.25 కోట్లు, సీడెడ్లో రూ. 88 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్లో రూ. 23 లక్షలు, వెస్ట్లో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రూ. 3.85 కోట్లు షేర్, రూ.6.65ట్లు గ్రాస్ను వసూలు చేసింది.
Recommended Video
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో రూ.3.85 కోట్లు షేర్ రాబట్టిన రోషన్ 'పెళ్లిసందD' మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షలు, ఓవర్సీస్లో రూ. 5 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 4.05 కోట్ల షేర్, రూ. 7.05 కోట్లు గ్రాస్ను రాబట్టి నెగెటివ్ టాక్తోనూ మంచి కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదవడంతో మరో 1.95 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది.