Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
Prabhas: సినిమాకు బడ్జెట్ 500 కోట్లు.. అందులో సగం పారితోషకాలకే..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బఫ్జెట్ ఎంత పెట్టుకోవాలో ఇప్పటికే నిర్మాతలకు ఒక క్లారిటీ వెచ్చేసింది. అలాగే దర్శకులు కూడా పాన్ ఇండియా కథలను అంచనాలకు తగ్గట్లుగానే సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ చేస్తున్నన్ని పాన్ ఇండియా సినిమాలు మరెవరు చేయడం లేదు. ఇక రీసెంట్ గా ఒక సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి.
ఒకేసారి మూడు సినిమాలు
గతంలో ఎప్పుడు లేని ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి ఎక్కువ సినిమాలను లైన్ లో లెట్టాడు. ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ పైకి తెచ్చాడు అంటే డేరింగ్ అనే చెప్పాలి. కమిట్మెంట్ ఇస్తేనే ఒక టెన్షన్స్ ఉంటుంది. అలాంటిది మూడు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ను మ్యానేజ్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇలాంటి రోజుల్లో..
లాక్ డౌన్ అనంతరం
రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ హడావిడి లేకపోయి ఉంటే ఆ షూటింగ్ ఈపాటికే ఫినిష్ అయ్యి ఉండేది. ఇక సలార్ సినిమాతో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న ప్రభాస్ అలాగే ఆదిపురుష్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఇక లాక్ డౌన్ అనంతరం డేట్స్ మళ్ళీ క్లాష్ అయ్యే అవకాశం లేకపోలేదు.
మొదట కేవలం 300కోట్లు అనుకొని..
ఇక నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ కానుంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. వైజయంతి ప్రొడక్షన్ 500కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉంది. మొదట కేవలం 300కోట్లు అనుకున్నారు. కానీ క్యాస్టింగ్ ఎక్కువవ్వడంతో బడ్జెట్ లో డోస్ పెంచక తప్పలేదు.
Recommended Video
సగం వరకు రెమ్యునరేషన్ కోసమే
అయితే ఆ 500కోట్లల్లో సగం వరకు రెమ్యునరేషన్ కోసమే పోనుందట. ప్రభాస్ కు 100కోట్లు అనుకుంటే దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ అలాగే మిగతా ఆర్టిస్టులకు టెక్నీషియన్స్ కు మరో 100కోట్లకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇక బాలీవుడ్ నుంచి ఇటీవల మరో 8 మందిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే మిగతా 300కోట్లు షూటింగ్ పనులకు VFX కోసం ఖర్చు చేయనున్నట్లు సమాచారం.