Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రికార్డులు తిరగరాసిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్రభాస్ కెరీర్లోనే మైలురాయిగా
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని అంతర్జాతీయ సినిమా ప్రమాణాలకు ధీటుగా దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాంకేతిక విభాగాల కూర్పు ప్రభావంతో సాహో చిత్రం భారతీయ యాక్షన్ సినిమాలకు ఐకాన్గా మారే అవకాశం లేకపోలేదు. ఇక సాహో చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులు, ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్ర హక్కులను భారీ రేటు చెల్లించి సొంతం చేసుకొన్నారు. అయితే ఎంత మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వివరాలు మీ కోసం..
తెలంగాణ ఆంధ్రా ప్రీ బిజినెస్
ట్రేడ్ వర్గాల ప్రకారం.. సాహో ప్రీ రిలీజ్కు సంబంధించిన వివరాలు బాక్సాఫీస్ను షేక్ చేసేలా ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ జరిగింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సాహో బిజినెస్ కావడం సినీ, ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కేవలం తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోనే సాహో చిత్రం రూ.125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రభాస్ కెరీర్లోనే ఇది అత్యధికమని చెప్పవచ్చు.
తెలంగాణ, సీడెడ్లో
సాహో నైజాం హక్కుల విషయానికి వస్తే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బిజినెస్ జరిగింది. నైజాంలోనే థియేట్రికల్ హక్కులను రూ.40 కోట్లకు అమ్మడం ఓ రికార్డుగా మారింది. ఇక సీడెడ్లో ఈ చిత్రం హక్కులను రూ.25 కోట్లకు అమ్మడం సెన్సేషనల్గా మారింది. ఈ రెండు ప్రాంతాల్లోనే రూ.65 కోట్ల మేర బిజినెస్ జరగడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ను చెప్పింది.
ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఆంధ్రా విషయానికి వస్తే, మరో రూ.60 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. వైజాగ్ హక్కులను రూ.16 కోట్లు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల హక్కులను రూ.19 కోట్లకు డిస్టిబ్యూటర్లు సొంతం చేసుకొన్నారు. ఇక కృష్ణా జిల్లా హక్కులు రూ.8 కోట్లు, నెల్లూరు రూ.4.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల్లో
తెలంగాణ, ఆంధ్రేతర రాష్ట్రాల్లో బిజినెస్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కర్ణాటక హక్కులు రూ.28 కోట్లు, తమిళనాడు, కేరళ హక్కులు రూ.18 కోట్లు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన హక్కులు రూ.120 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా ఫ్యాన్సీ రేటుకు హక్కులు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో రూ.42 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. ఇలా ప్రాంతాల వారీగా కలుపుకొంటే మొత్తంగా రూ.333 కోట్ల బిజినెస్ రికార్డయింది.