Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
200 కోట్ల క్లబ్లో ‘భరత్’.. చెన్నైలో రికార్డు.. హిందీలో రీమేక్.. మహేష్ సెన్సేషనల్ కామెంట్!
Recommended Video
సూపర్స్టార్ మహేష్బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఏప్రిల్ 20న రిలీజైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతున్నది. 20 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. మే 5న రూ.190 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ చిత్రం మరో అడుగు ముందేసింది.
200 కోట్ల క్లబ్లోకి
భరత్ అనే నేను చిత్రం ప్రిన్స్ మహేష్బాబు కెరీర్లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో భరత్ అనే నేను రెండోస్థానంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఇప్పటికే 200 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే.
|
ట్విట్టర్లో డీవీవీ కామెంట్
భరత్ అనే నేను గ్రాస్ కలెక్షన్ల గురించి డీవీవీ బ్యానర్ ట్విట్టర్లో మే5 ఓ ప్రకటన చేసింది. మా చిత్రం రూ.190.63 గ్రాస్ కలెక్షన్లను సాధించింది అని ట్వీట్లో పేర్కొన్నారు. రెండువారాల్లో ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు మహేష్బాబు స్టామినాకు అద్దం పట్టిందని పేర్కొన్నారు.
|
చెన్నైలో టాలీవుడ్ రికార్డు
తమిళనాడులో భరత్ అనే నేను ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ చిత్రం తమిళనాట రూ.4.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం చెన్నైలోనే 1.6 కోట్లు సాధించింది. చెన్నైలో ఈ రేంజ్లో వసూళ్లను సాధించడంలో భరత్ అనే నేను ఓ రికార్డు నెలకొల్పింది అని చిత్ర పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు.
కొరటాల శివ కథ చెప్పినప్పుడే
భరత్ అనే నేను విజయానందాన్ని ప్రిన్స్ మహేష్ యూరప్ ట్రిప్లో ఆస్వాదిస్తున్నారు. యూరప్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు శివ కథ చెప్పినప్పుడే స్క్రిప్టుపై గొప్ప విశ్వాసం కలిగింది. వినోదానికి ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తారనే విషయాన్ని మొదటి నుంచి నమ్ముతాను. ఆ దిశలోనే భరత్ అనే నేను సినిమాను రూపొందించాం. ఈ చిత్రం ద్వారా సామాజిక సందేశాన్ని ఇవ్వడం ప్రేక్షకులకు నచ్చింది అని మహేష్ బాబు అన్నారు.
బాలీవుడ్లోకి రీమేక్
భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై అన్ని భాషల సినీ నిర్మాతలు కన్నేశారు. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ ప్రముఖులు సంప్రదిస్తున్నారు. ఇప్పటికే చాలా మందితో చర్చలు జరిగాయి. త్వరలోనే వివరాలు అందిస్తాం అని ప్రిన్స్ మహేష్ పేర్కొన్నారు.