Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కష్టే ఫలి...అదే బాహుబలి :'బాహుబలి-2' కు భారీ ఆఫర్!భాక్సాఫీస్ సెన్సేషన్
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి-2' . మండే ఎండల మధ్య షూటింగ్ స్పాట్లో కూలర్లు, ఏసీలు పెటుకుని మరీ షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. వీరి కష్టానికి తగిన ఫలితం దక్కబోతోందని తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం...'బాహుబలి-2' హిందీ వెర్షన్ రైట్స్ ని పూర్తిగా ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాణ యష్రాజ్ ఫిలిమ్స్కు అమ్మాలని ఆర్కా మీడియా భావిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు, హిందీ వెర్షన్ హక్కులు, శాటిలైట్ హక్కుల కోసం మొత్తంగా రూ. 150 కోట్లు చెల్లించడానికి యష్రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కరణ్ జోహార్ 100 కోట్లు పెట్టి ఈ రైట్స్ ని తీసుకున్నారు.
'బాహుబలి: ద బిగినింగ్' హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలుకొట్టడంతో యష్ రాజ్ సంస్ద ఈ విషయమై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి కరుణ్ జోహార్ ఏమంటారో చూడాలి.
ఇక ముందుగా అనుకున్నట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ 14న 'బాహుబలి: ద కన్క్లూజన్'ను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్, రానా దగ్గుబాటి మధ్య యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఎండలు బాగా పెరిగిపోయిన నేపధ్యంలో 'బాహుబలి-2' చిత్రయూనిట్కు రాజమౌళి ఒక నెల సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సెలవు ముగిసిన వెంటనే సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ బ్రేక్ తర్వాతనే సినిమాలో ప్రధాన యాక్షన్ ఘట్టమైన వార్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.