Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్చ్... పరమ రొటీన్ : రామ్ 'శివమ్' ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : హైదరాబాద్: రామ్, రాశీఖన్నా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శివమ్'. స్రవంతి మూవీస్ బ్యానర్పై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. శనివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.
ఈ ట్రైలర్ చూసిన వారు...చాలా రొటీన్ గా ఉందని అంటున్నారు. కాస్త కామెడీ, విలన్ తో ఛాలెంజ్, హీరో లవ్ స్టోరీ,రెగ్యలర్ రొటీన్ లవ్ స్టోరీ లా ఉండబోతోందని ఈ ట్రైలర్ హింట్ ఇస్తోందని అంటున్నారు.
ముఖ్యంగా స్రంవతి బ్యానర్ ...30 సంవత్సరాలు అయిన సందర్బంగా తీస్తున్న చిత్రం కావటంతో సినిమామపై మంచి అంచనాలు ఉన్నాయి అయితే ఓ ట్రైలర్ తోనే సినిమాని అంచనా వెయ్యలేమన్నది నిజం.. మరోసారి విడుదల చేసే ట్రైలర్ లోనే కొత్తదనం ఏదన్నా ట్రై చేస్తారేమో చూద్దాం.
నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ''హుషారైన ఓ కుర్రాడి ప్రేమకథ ఇది. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కుతోంది. రామ్ తన శైలికి తగ్గ పాత్రని పోషిస్తున్నాడు''అన్నారు.
అలాగే - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.
బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాష్రెడ్డి, పోసాని తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్