Ramarao On Duty 4 Days Collections: దారుణంగా సోమవారం కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ ఇక అసాధ్యమే!
బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి తక్కువ సమయంలోనే స్టార్గా మారారు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన మాస్ ఫాలోయింగ్తో పాటు మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెంచుకురు. ఈ ఏడాది 'ఖిలాడీ' అనే మూవీతో వచ్చిన రవితేజ.. తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని విధంగా మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' నాలుగో రోజు రిపోర్టును చూద్దాం!

ఎంతో ప్రతిష్టాత్మకంగా
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమాలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను రవితేజ తన రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరితో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించగా వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే.

17.20 కోట్ల బిజినెస్
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకోగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 17.20 కోట్ల బిజినెస్ చేసుకుంది.

'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజు కలెక్షన్లు
తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏపీ, తెలంగాణలో రూ. 22 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.

4 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది
ఏపీ, టీఎస్లో 'రామారావు ఆన్ డ్యూటీ'కి మూడు రోజుల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలుపుకుని రూ. 3.87 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా
ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో కేవలం రూ. 3.87 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్లో రూ. 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.63 కోట్లు షేర్తో పాటు రూ. 8.10 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ ఎంత రావాలి?
మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.63 కోట్లు వచ్చాయి. అంటే మరో 13.37 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. సోమవారం నాడు దారుణంగా వసూళ్లు రావడంతో ఇక బ్రేక్ ఈవెన్ అనేది అసాధ్యంగానే చెప్పాలి.


Click it and Unblock the Notifications











