Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 9 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎట్టకేలకు: 'రేయ్' చిత్రం విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: వైవియస్ చౌదరి కష్టాలు తీరినట్లే. ఆయన దర్శకత్వంలో రూపొందిన సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా 'రేయ్' గుర్తుండే ఉండి ఉంటుంది. దానికంటేమ ముందే సాయి నటించిన రెండో సినిమా పిల్లానువ్వులేని జీవితం విడుదలై మెగా అభిమానులను మెప్పించింది.... ఆ సమయంలోనే రేయ్ సినిమా రిలీజ్ కూడా ఉంటుందని అంతా భావించారు. కానీ అలా జరగ లేదు. సమస్యలన్నీ అధిగమించి.. వచ్చే నెల 27న ఈ సినిమాను విడుదల చేయడానికి విడుదల తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ మేరకు అన్ని ఏరియాలు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. నిర్మాత నట్టికుమార్.. వైజాగ్ ఏరియా రైట్స్ ని సొంతం చేసుకున్నారు. దాదాపు ఇరవై కోట్లు ఈ చిత్రంపై వైవియస్ చౌదరి ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం విడుదల చేయాలని ఫైనల్ చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వైవియస్ చౌదరి చిత్రం 'రేయ్' పూర్తి అయ్యి చాలా కాలం అయినా విడుదల కాలేదు. సాయి ధరమ్ తేజ చేసిన రెండో చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం విడుదల అయ్యింది కానీ ఫైనాన్సియల్ కారాణాలతో 'రేయ్' ఆగిపోయింది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్ధితిలో ఉన్న ఆ ప్రాజెక్టు గురించి చాలా రోజుల తర్వాత వైవియస్ చౌదరి మీడియాతో మాట్లాడారు.
వైవియస్ చౌదరి మాట్లాడుతూ '''రేయ్' విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా కష్టపడ్డా. ఈ సినిమా విడుదల విషయంలో నాకు శక్తిని ప్రసాదించమని ఎన్టీఆర్ ని ప్రార్థించా. అందరి సహకారంతో త్వరలోనే 'రేయ్' చిత్రాన్ని విడుదల చేస్తాను. ఎన్టీఆర్ నా దేవుడు. నన్ను పై నుంచే ఆయన దీవిస్తుంటారని నా నమ్మకం. ఎలాంటి కష్టం వచ్చినా ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి 'అన్నా...' అని వేడుకొంటా''అన్నారు.

నాకై ఓ సొంత సినిమా బ్యానర్ ‘బొమ్మరిల్లు వారి'ని స్థాపించాను. పైనుండి ఆయన ఆశీస్సులు నాకుంటాయని నమ్మకం. ‘రేయ్' సినిమా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే నా టీమందరి సహకారంతో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాను.'' అని చెప్పారు.
''రేయ్.. రామ్చరణ్ కోసం రాసుకొన్న కథ. అయితే సాయిధరమ్తేజ్లో ఒకప్పటి చిరంజీవిగారి పోలికలు కనిపించాయి. అందుకే తనతో ఈ సినిమా తెరకెక్కించా'' అంటున్నారు వైవీఎస్ చౌదరి. ఆయన నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రేయ్'. సాయిధరమ్తేజ్, సయామీఖేర్ జంటగా నటించారు. శ్రద్దాదాస్ కీలక పాత్రధారి.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''నాకు శిరీష్ ఎంతో సాయీ అంతే. చిన్నప్పటి నుంచీ తనకి సినిమాలంటే పిచ్చి. 'సాయిని హీరోని చేసేద్దామా?' అని చరణ్ని చాలాసార్లు అడిగా. 'వాడు బుద్ధిగా చదువుకొంటున్నాడు కదా.. వదిలేయ్' అన్నాడు. తీరా చూస్తే 'రేయ్' సినిమా చేసేశాడు. సాయిని హీరోగా మార్చిన వైవిఎస్ చౌదరికి కృతజ్ఞతలు'' అన్నారు. ''నా కష్టం వెనుక బన్నీ అందించిన సహకారం చాలా ఉంది. కుదిరితే వైవిఎస్ చౌదరితో మరో సినిమా చేస్తా'' అన్నాడు సాయిధరమ్ తేజ్.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్ఫుడ్ తరహా లవ్స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.
ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్లో కొంత భాగం, హైదరాబాద్లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్లో సెటిల్ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.
అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నరేష్, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్.