Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రేపు రిలిజ్ లేదు...చివరి నిముషంలో వాయిదా
హైదరాబాద్ : పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై సచిన్ (వౌనమేలనోయి ఫేం) హీరోగా కె.రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ రూపొందిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదలైంది. హిందీలో విజయవంతమైన 'ఆషికీ-2' చిత్రాన్ని రీమేక్ చేసి విడుదలకు సిద్దం చేసారు. రేపు(ఆగస్టు 15) విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి నిముషాల్లో ఆగస్టు 22 కి వాయిదా పడిందని సమాచారం. ఈ సినిమా ద్వారా సంజయ్దత్ మేనకోడలు నజియా హీరోయిన్ గా పరిచయమవుతోంది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- దబాంగ్ చిత్రం తీసుకొని గబ్బర్సింగ్గా తాను రీమేక్ చేశానని, ఇప్పుడు ఆషికి-2 చిత్రాన్ని తెలుగులో తన మిత్రుడు సచిన్ హీరోగా రూపొందిస్తున్నాడని, తన వ్యాపారాలతో బిజీగా ఉన్నా సచిన్ ఈ చిత్రంలో తనకోసం నటిస్తున్నాడని, ఆషికి కథను ఏ మాత్రం మార్చకుండా క్లైమాక్స్లో చిన్న చిన్న మార్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సంగీతం కూడా అదే బాణాలతో ఉంటుందని సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తిచేసామని ఆయన తెలిపారు.
దాదాపు 8 సంవత్సరా తరువాత తెలుగులో తన స్నేహితుడైన బండ్ల గణేష్ ద్వారా రీ ఎంట్రీ అవుతున్నందుకు ఆనందంగా ఉందని హీరో సచిన్ తెలిపారు. తనకు నచ్చిన ఆషికి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ఆ చిత్రాన్ని చూసినప్పుడే తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుందని అనుకున్నానని, అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు కె.రవీంద్ర తెలిపారు.
ఇక దర్శకుడు జయ రవింద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం ఆ మధ్యన విడుదలై డిజాస్టర్ అయ్యింది. వికింగ్ మీడియా, బండ్ల గణేష్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు.
రావూ రమేష్, శశాంక్, కాశీ విశ్వనాధ్, పృధ్వీ, రవివర్మ, అనితా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:మధుసూదన్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్:గౌతమ్రాజు, కెమెరా:ఎ.వసంత్, సంగీతం: అంకిత్ తివారి, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: కె.రవీంద్ర.