Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
300 కోట్లు కాదు.. అలా అయితే 600 కోట్లు.. భారత్ కలెక్షన్లపై సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం జూన్ 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సల్లూభాయ్ సరసన కత్రినా కైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి అందాల తార ప్రియాంక చోప్రా అనూహ్యంగా తప్పుకోవడంతో కత్రినా కైఫ్కు హీరోయిన్గా ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలోని కత్రినా పాత్రపై సల్మాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్ల విషయం అత్యంత చర్చనీయాంశమవుతున్నది.
సల్మాన్ ఖాన్ సినిమా రూ.150 కోట్లు వసూలు చేసినా పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కనీసం తక్కువలో తక్కువ రూ.300 కోట్లు వసూలు చేస్తేనే దానిని హిట్గా పరిగణిస్తారు. ఈ సినిమా కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు భారీగా అంచనాలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఒకవేళ 300 కోట్లు మీరు టార్గెట్గా నిర్దేశిస్తే అందరూ వెళ్లి థియేటర్లో సినిమా చూడాలి. అప్పుడే అంత వసూలు అవుతుంది. ఇంట్లో కూర్చొని పైరసీ వెర్షన్ చూడొద్దు. కొన్ని రోజుల తర్వాత టీవీలో చూద్దామనే ఆలోచనను మానుకోండి.. అప్పుడు 300 ఏంటి? 600 కోట్లు కూడా వస్తాయి అని సల్మాన్ ఖాన్ అన్నారు.
దక్షిణ కొరియాలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఆడ్ టు మై ఫాదర్ చిత్రానికి రీమేక్ భారత్. ఈ చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జూలియస్ పాకియం, సినిమాటోగ్రఫి జార్జ్ సీ విలియమ్స్, రామేశ్వర్ ఎస్ భగత్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.