Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారత్ డబుల్ సెంచరీ.. సల్మాన్ ఖాన్ కెరీర్లో మరో రికార్డు
బాలీవుడ్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం విడుదల నాటి నుంచి 14 రోజున రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సల్మాన్ కెరీర్లో రూ.200 క్లబ్లో చేరిన సినిమా ఇది ఆరోవది కావడం విశేషం. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రంజాన్ సెంటిమెంట్తో
రంజాన్ కానుకగా భారత్ చిత్రం దేశవ్యాప్తంగా 4700 థియేటర్లలో విడుదలైంది. ఉత్తరాదిలోనే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ ఏడాది యూరీ తర్వాత భారీ వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా భారత్ నిలిచింది. రెండో వారం ముగియస్తున్న నేపథ్యంలో ఉత్తరాదిలో ఈ సినిమాకు ఇంకా మంచి ప్రజాదరణ కనిపిస్తున్నది.
|
200 క్లబ్లోకి ఇలా చేరి..
భారత్ వసూళ్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద భారత్ స్కోర్ డబుల్ సెంచరీ కొట్టింది. ఈ చిత్రం 200 కోట్ల మార్కు దాటింది. ఉత్తరాదిలో బ్రహ్మండంగా ఉంది. మిగితా ప్రాంతాల్లో వసూళ్లు క్షీణించింది. శుక్రవారం రూ.4.30 కోట్లు, శనివారం రూ.6.37 కోట్లు, ఆదివారం రూ.6.19 కోట్లు, సోమవారం రూ.2.63 కోట్లు, మంగళవారం రూ.2.32 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.201.86 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్లో పేర్కొన్నారు.
రికార్డుపై సల్మాన్ ఖాన్ ట్వీట్
భారత్ చిత్రం రూ.200 క్లబ్లో చేరడంపై సల్మాన్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై ట్విట్టర్లో స్పందిస్తూ.. చిత్ర విజయంలో పాలుపంచుకొన్న ప్రతీఒక్కరికి థ్యాంక్స్. ఇలాంటి రియాక్షన్ చాలా అరుదుగా వస్తుంది. చాలా తక్కువ సినిమాలకు ఇలాంటి స్పందన దక్కుతుంది. అలాంటి గౌరవం భారత్కు దక్కింది అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు.
సల్మాన్ ఖాన్ ఎమోషనల్
ఏ సినిమా అయితే నాకు బాగా అనిపిస్తుందో.. అది మీకు నచ్చుతుందని నేను చెప్పగలను. ప్రతీసారి ఇది నిజమని రుజువు చేశారు. నేను ఏ సినిమాలో నటించిన అదీ మీకు నచ్చడం నాకు ఆనందంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరు ఈ సినిమాను విజయం వైపు నడిపించారు. అందుకు ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. భారత్ సినిమాను ఆదరించింనందుకు థ్యాంక్స్ అని సల్మాన్ పేర్కొన్నారు.
కామన్ మ్యాన్ బయోపిక్గా
కొరియాలో ఘనవిజయం సాధించిన ఆడ్ టూ మై ఫాదర్ అనే చిత్రం ఆధారంగా భారత్ రూపొందింది. ఇది ఓ కామన్ మ్యాన్ బయోపిక్ మాదిరిగా తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్ 70 ఏళ్ల ముసలివాడిగా కనిపించడం గమనార్హం. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సునీల్ గ్రోవర్, దిశా పటానీ, టబు తదితరులు నటించారు.