Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సైరాకు షాకిచ్చిన జాను...చిరంజీవి కంటే సమంత టాప్ క్రేజ్
కరోనా లాక్డౌన్ వ్యవహారం ఇంటిల్లిపాదిని టెలివిజన్ సెట్లకు అతుక్కునేలా చేసింది. ఇంట్లో టీవీ, ఓటీటీ ఫ్లాట్ఫాంతో సినీ ప్రేక్షకులకు కాలం వెళ్లదీస్తున్నారు. దాంతో టెలివిజన్ రేటింగ్స్ అనూహ్యంగా పెరిగిపోయాయి. పాత, కొత్త సినిమాలతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా టీవీ సీరియల్స్, ప్రత్యేకమైన షోలకు మంచి ఆదరణ కనిపిస్తున్నది. తాజాగా బార్క్ రిలీజ్ చేసిన టీఆర్సీ రేటింగ్ విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజా బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క) టెలివిజన్ ఛానెల్స్ రేటింగ్ ఇలా ఉన్నాయి..
స్టార్ మా, జెమినిల హవా
తెలుగు టెలివిజన్ ఛానెల్స్లో ఈటీవీ తెలుగు టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్టార్ మా రెండో స్థానంలో, మూడోస్థానంలో జెమినిలో ఉన్నాయి. టాప్ ఐదు స్థానాల్లో ఈ టీవీ రెండు స్థానాలను, స్టార్ మా రెండు స్థానాలను దక్కించుకొన్నాయి. అయితే టీవీ9, టీవీ5, ఎన్టీవీ పక్కకు నెట్టి ఈటీవీ న్యూస్ టాప్గా విశేషం. ఈ ఏడాది 15వ వారంలో 8975 పాయింట్లతో అత్యంత ప్రజాదరణ ఉన్నా కార్యక్రమంగా ఈటీవీ న్యూస్ టాప్ లేపింది.
సైరా కంటే జానుకే క్రేజ్
లాక్డౌన్ పిరియడ్ను దృష్టిలో పెట్టుకొని పలు సినిమాలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రదర్శించాయి. అందులో సమంత, శర్వానంద్ నటించిన జాను, మెగాస్టార్ నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రాలు ప్రముఖంగా నిలిచాయి. అయితే సైరా కంటే జానుకే ఎక్కువగా రేటింగ్ రావడం గమనార్హం. సైరాకు 5725 పాయింట్లు రాగా, జానుకు 6152 పాయింట్లు వచ్చాయి.
కార్తీక దీపం సీరియల్కు అనూహ్య ఆదరణ
ఇక డైలీ సిరియల్స్లో కార్తీక దీపంకు మంచి ప్రజాదరణ ఉన్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్స్కు 5342 పాయింట్లతో టాప్గా నిలిచింది. దీంతో మరోసారి కార్తీక దీపం సీరియల్స్కు మంచి ఆదరణ ఉందనేది, ఈ సిరియల్స్కు ఫ్యామిలీ వర్గాల క్రేజ్ ఉందని ఈ రేటింగ్ స్పష్టం చేసింది. ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
దసరా మహోత్సవానికి మంచి టీఆర్సీ
ఇక ప్రత్యేక కార్యక్రమంలో దసరా మహోత్సవం టాప్ 5 స్థానంలో నిలిచింది. దసరా కోసం ప్రత్యేకంగా షూట్ చేసిన ఈ కార్యక్రమం పున: ప్రసారం చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి 5242 పాయింట్లతో రేటింగ్ లభించింది.
Recommended Video
న్యూస్ ఛానెల్స్ రేటింగ్
తెలుగు రాష్ట్రాల్లో బార్క్ న్యూస్ ఛానెల్స్ రేటింగ్ ఇలా ఉన్నాయి. తెలంగాణలో టీవీ9 198 పాయింట్లు, వీ6 87, ఎన్టీవీ 83, టీవీ5 77, సాక్షి 54 పాయింట్లలో టాప్ 5 స్థానాల్లో నిలిచాయి. ఏపీ, తెలంగాణలో చూసుకొంటే టీవీ9 135 పాయింట్లు, టీవీ5 77 పాయింట్లు, ఎన్టీవీ 67 పాయింట్లు, సాక్షి 55 పాయింట్లతో టాప్ 5 ప్లేస్లో నిలిచాయి.