Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బీరువా కూడా చెక్కేసారట..ఎంత స్పీడో
హైదరాబాద్: సందీప్ కిషన్ స్పీడ్ మిగతా హీరోలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఓ ప్రక్కన జోరు చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది అనుకునే లోగా...ఇంకో చిత్రం బీరువా కూడా షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఉషా కిరణ్ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఇక ఈ చిత్రం కోసం సందీప్ కిషన్ గుండుతో కనిపించనున్నాడని సమాచారం.
సందీప్ కిషన్ , సురభి జంటగా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకి ‘నా ఊపిరి' ఫేం కన్మణి డైరెక్టర్. ఆ పాటలని కూడా పూర్తి చేసి చేసి ఈ సినిమాని నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో సందీప్ కిషన్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మంచి విజయం సాధించింది. అదే తరహాలోనే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.
సందీప్ కిషన్ మరో చిత్రం ‘జోరు' విషయానికి వస్తే...
కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అర్జున్ సమర్పణలో సందీప్ కిషన్, రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ నటీనటులుగా అశోక్, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జోరు'. కుమార్ నాగేంద్ర దర్శకుడు.
‘‘కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో చేస్తున్న రెండో చిత్రమిది. ఆయనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా అంగీకరించాను. చక్కని అవుట్ రాబట్టడం కోసం ఆర్టిస్ట్ల బెండు తీశాడు. ఫైనల్గా ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇచ్చాడు'' అని సందీప్ కిషన్ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. సినిమాను ప్రేమించే నిర్మాతలు చేసిన ఈ సినిమాకు చక్కని టీమ్ కుదిరింది. సీనియర్ నటులతో పని చెయ్యడానికి కాస్త భయపడ్డా. ఆ భయం చక్కని అనుభవాన్ని ఇచ్చింది. భీమ్స్ కొత్త రకమైన పాటలిచ్చాడు. ‘మనసా చెప్పవే' సాంగ్ బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాతో మా ‘జోరు' చూపిస్తాం'' అని అన్నారు.
రాశిఖన్నా మాట్లాడుతూ ‘‘వినోదాత్మకమైన సినిమాలో అన్నపూర్ణగా చక్కని పాత్ర పోషించాను. టీమంతా చాలా సపోర్ట్ చేశారు'' అని తెలిపారు. నిర్మాత అశోక్ మాట్లాడుతూ ‘‘చక్కని సంగీతసాహిత్యాలు కుదిరాయి. పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భీమ్స్ని సంగీత దర్శకుడిగా మరో లెవల్కి తీసుకెళ్ళే సినిమా ఇది. సందీప్ సహకారం మరువలేనిది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం'' అని తెలిపారు.
‘‘సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది'' అని దర్శకుడు కుమార్ నాగేంద్ర చెప్పారు. ‘‘నా గత చిత్రాలకన్నా మంచి పేరు తెచ్చే సినిమా ఇది. రాశిఖన్నా పాడిన టైటిల్ సాంగ్కి చక్కని ఆదరణ లభిస్తోంది'' అని భీమ్స్ అన్నారు...