సరిలేరు నీకెవ్వరు క్లోజింగ్ కలెక్షన్లు.. ‘అల’ దెబ్బతో.. మహేష్ కోటకు బీటలు!
సంక్రాంతి కానుకగా రిలీజైన సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్ర ఆరు వారాలకుపైగా బాక్సాఫీస్ సందడి ముగిసింది. ఆరంభంలో మంచి జోష్తో కలెక్షన్లు మొదలైనప్పటికీ.. అల వైకుంఠపురం సినిమా ధాటికి వసూళ్లు సన్నగిల్లాయి. అయితే ఓ రేంజ్లో నిలకడ సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గత 37 రోజులకుపైగా వసూళ్లను పరిశీలిస్తే..

మహేష్ స్టామినాకు తగినట్టుగా
సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ సినిమాల ఒత్తిడిని తట్టుకొని రిలీజ్ నుంచి క్లోజింగ్ వరకు భారీ రేంజ్లోనే కలెక్షన్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.116.88 కోట్ల షేర్ను రాబట్టింది. అల వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ను ఎదురించి ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం మహేష్ బాక్సాఫీస్ స్టామినాను రుజువు చేసింది.

ఓవరాల్గా ఏపీ, తెలంగాణలో
ఏపీ, తెలంగాణలో ఏరియాలో వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ.40 కోట్లు
సీడెడ్లో రూ.15.6 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.19.83 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.11.5 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.45 కోట్లు
గుంటూరులో రూ.10 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.9 కోట్లు
నెల్లూరులో రూ.4 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్ మార్కెట్లో
సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓవర్సీస్లో భారీగా కలెక్షన్లను రాబట్టిది. అమెరికాలో ఈ చిత్రం 2.3 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, కెనడాలో 15 వేల డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ రెండు దేశాల కలెక్షన్లు కలిపితే 2.5 మిలియన్ డాలర్లుగా నమోదైంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల తర్వాత మహేష్ కెరీర్లో మూడో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లతో
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లో చూస్తే రూ.12 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల షేర్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
Recommended Video


ఎంత లాభం సాధించిందంటే..
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా జరిగింది..
నైజాంలో రూ.25 కోట్లు
సీడెడ్లో రూ.10.80 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.10 కోట్లు
తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.20 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6 కోట్లు
గుంటూరులో రూ.7.20 కోట్లు
కృష్ణా జిల్లాలో రూ.6 కోట్లు
నెల్లూరులో రూ. 3 కోట్లు
ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి రూ.75 కోట్లకుపైగా
కర్ణాటకలో రూ.8.30 కోట్లు
మిగితా రాష్ట్రాల్లో రూ.1.85 కోట్లు
ఓవర్సీస్ హక్కులు రూ.14 కోట్లకు కలిపి మొత్తంగా ఈ చిత్రం రూ.99.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.100 కోట్ల షేర్ సాధించాల్సి ఉండగా.. రూ.140 కోట్లతో సరిపెట్టుకొన్నది. అయితే ఈ గణాంకాలు మహేష్ స్టామినాకు తగినట్టు లేవనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











