Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
SVP 4 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్లు.. 4 రోజులకే అన్ని కోట్లు.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
బడా హీరో కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్ను కూడా భారీగా పెంచుకుని పక్కా కమర్షియల్ హీరోగా మారిపోయాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
మళ్లీ బిజినెస్ చేసి మహేశ్ బాబు
వరుస హిట్లతో ఫామ్లో ఉన్న మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్గా నటించారు.
హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!
సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
4వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'సర్కారు వారి పాట'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 5.15 కోట్లు, సీడెడ్లో రూ. 1.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.03 కోట్లు, ఈస్ట్లో రూ. 1.10 కోట్లు, వెస్ట్లో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 77 లక్షలు, నెల్లూరులో రూ. 41 లక్షలతో కలిపి రూ. 12.06 కోట్లు షేర్, రూ. 18.20 కోట్లు గ్రాస్ వచ్చింది.
మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!
4 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' 4 రోజుల్లోనూ బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 27.55 కోట్లు, సీడెడ్లో రూ. 8.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.37 కోట్లు, ఈస్ట్లో రూ. 6.49 కోట్లు, వెస్ట్లో రూ. 4.15 కోట్లు, గుంటూరులో రూ. 7.51 కోట్లు, కృష్ణాలో రూ. 4.52 కోట్లు, నెల్లూరులో రూ. 2.71 కోట్లతో కలిపి రూ. 71.12 కోట్లు షేర్, రూ. 102.60 కోట్లు గ్రాస్ను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 71.12 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.60 కోట్లు, ఓవర్సీస్లో రూ. 10.15 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 4 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 85.87 కోట్లు షేర్తో పాటు రూ. 133.80 కోట్ల గ్రాస్ వచ్చింది.
అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్లో 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 రోజుల్లో రూ. 85.87 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 35.13 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది.