Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
Sarkaru Vaari paata : మహేష్ కెరీర్ లో నాలుగో సినిమాగా ఎంట్రీ.. రచ్చ రేపిందిగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకుండా ముందుకు దూసుకెళుతోంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల తో వంద కోట్ల రూపాయల మార్కును దాటింది. దీంతో మహేష్ కెరీర్ లో వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ను దాటిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరింది. ఆ వివరాల్లోకి వెళితే
ఆద్యంతం ఆకట్టుకుందని
సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం సూపర్ హిట్ తర్వాత పరుశురాం దర్శకత్వంలో చేసిన సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు, నదియా, తనికెళ్ల భరణి, సముద్రఖని, వెన్నెల కిషోర్ సుబ్బరాజు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుందని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు.
మరో మైలురాయిగా
అయితే సినిమా బాలేదని చెబుతూ మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ తమ సినిమాకి మొదట నెగిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ తర్వాత ఆ నెగిటివ్ రివ్యూలు పాజిటివ్ గా మారిపోయాయి అంటూ సినిమా యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పతాకాల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయింది.
ప్రీ రిలీజ్ బిజినెస్
సర్కారు వారి పాట సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లుగా నమోదైంది. ఈ సినిమా లాభాల జోన్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 121 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల బ్రేక్ ఈవెన్తో 9వ రోజున కొనసాగించిన సర్కారు వారి పాట చిత్రం పెద్దగా వసూళ్లు నమోదు చేయలేకపోయింది. ఈ సినిమా 9వ రోజున నైజాంలో 4 లక్షలు, సీడెడ్లో 21 లక్షలు, ఉత్తరాంధ్రలో 24 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 లక్షలు, గుంటూరు జిల్లాలో 7 లక్షలు, కృష్ణా జిల్లాలో 7 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షలు వసూలు చేసింది.
9వ రోజు
దీంతో 9వ రోజు ఈ సినిమా 1.40 కోట్ల వసూలు షేర్, 2.65 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అలా సర్కారు వారి పాట సినిమా గత 9 రోజుల్లో నైజాంలో 30.89 కోట్లు, సీడెడ్లో 10.42 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.26 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 7.78 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 5.06 కోట్లు, గుంటూరు జిల్లాలో 8.17 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.32 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3.19 కోట్లు రాబట్టింది.
నాలుగో 100 కోట్ల సినిమా
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5.90 కోట్లు, ఓవర్సీస్లో 11.66 కోట్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా 99.65 కోట్లు(రౌండ్ ఫిగర్ 100 కోట్లు), 158.60 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక అలా ఈ సినిమా మహేష్ కెరీర్ లో నాలుగో 100 కోట్ల సినిమాగా నిలిచింది. గతంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేను సినిమాలు 100 కోట్లు సంపాదించాయి.