Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
SVP Collections: ఆ దేశంలో సర్కారు వారి పాట హవా.. ఆల్టైం రికార్డును బ్రేక్ చేయలేకపోయిన మహేశ్
ఆ మధ్య కాలంలో భారీ డిజాస్టర్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ఇటీవల 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్బస్టర్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ విజయాలు ఇచ్చిన జోష్తోనే అతడు వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ స్టార్ హీరో 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు రేంజ్కు తగ్గట్లుగానే చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, దానితో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి. ఫలితంగా మొదటి రోజు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తోంది. దీంతో ఈ వీకెండ్ మొత్తం దీనికి భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను కూడా ఈ సినిమా బద్దలు కొట్టేసిన విషయం తెలిసిందే.
మిగిలిన ప్రాంతాల కంటే ఓవర్సీస్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మార్కెట్ భారీగానే ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'సర్కారు వారి పాట' ఓవర్సీస్ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రిలీజ్ హక్కులను ఫ్లై హై సినిమాస్, శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ మూవీ బుకింగ్స్ విడుదల కంటే ముందుగానే ప్రారంభం అయ్యాయి. అక్కడ ప్రీమియర్స్ సహా మొదటి రోజు టికెట్లు కూడా ఎప్పుడో బుక్ అయిపోయాయి. దీంతో రిలీజ్కు ముందే ఈ సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా కలెక్షన్లు దక్కాయి. అదే సమయంలో వేగంగానే ఒక మిలియన్ డాలర్ల మార్కును కూడా ఈ సినిమా చేరుకుంది.
మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!
ప్రీమియర్స్తో పాటు మొదటి రోజే ఒక మిలియన్ డాలర్లను వసూలు చేసిన 'సర్కారు వారి పాట' మూవీ.. అదే హవాను చూపిస్తూ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రెండు మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. దీంతో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న అతి తక్కువ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' మూవీ కేవలం రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే.. ఆ రికార్డును 'సర్కారు వారి పాట' బ్రేక్ చేయలేకపోయింది. దీనిపై నిరాశగా ఉన్నా.. ఓవరాల్ కలెక్షన్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్గా నటించారు. నదియా, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.