Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
Sarkaru Vaari Paata: అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మహేష్ అరాచకం.. న్యూ రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానూలు ఇప్పుడు మొదటిరోజు మొదటి షో చూసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరుశురాం నాగచైతన్యతో సినిమా చేయాల్సింది. కానీ అతను మళ్లీ ప్రణాళికను మార్చుకొని మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేశాడు. మహేష్ బాబు కూడా స్టోరీ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం ఏడాదిలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా రెండున్నరేళ్ల నిరీక్షణకు ముగింపు కార్డ్ పెట్టబోతోంది.
ఈ శుక్రవారం రాబోతున్న సర్కారు వారి పాట మహేష్ బాబు సర్కారు వారి పాట భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఎలాగైనా ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని మహేష్ బాబు కూడా రెడీగా ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని ముఖ్యంగా ఫస్టాఫ్ 40 నిమిషాలు కూడా కామెడీతో అదిరిపోతుంది అని కూడా వివరణ ఇచ్చారు.
అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సర్కారు వారి పాట మొదటి రోజు తప్పకుండా 30 నుంచి 40 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కేవలం హైదరాబాద్లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇక అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బాగ్య నగరంలో ఇప్పటికే రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కేవలం హైదరాబాద్లోనే ఈ రేంజిలో కలెక్షన్స్ వస్తున్నాయంటే మిగతా ఏరియాల్లో ఏ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదై ఉంటాయో ఊహించవచ్చు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అలాగే రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.