Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాక్సాఫీసు వద్ద టెంపర్ లేచింది....రూ. 350 కోట్లతో సంచలనం!
తెలుగు సూపర్ హిట్ చిత్రం 'టెంపర్' హిందీ రీమేక్ 'సింబా' బాక్సాఫీసు వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా రూపొందిన ఈ మూవీ తాజాగా రూ. 350 కోట్ల మార్కును అందుకుంది. ఈ విజయంతో వరుసగా 8 రూ. 100 కోట్ల పై చిలుకు వసూళ్లు సాదించిన సినిమాలు తీసిన దర్శకుడిగా రోహిత్ శెట్టి రికార్డులకెక్కారు.
విడుదలైన 3వ వారం కూడా బాక్సాఫీసు వద్ద 'సింబా' కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. 'ఉరి-ది సర్జికల్ స్టైక్', 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాలు విడుదలైనా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తూ దేశీయ బాక్సాపీసు వద్ద రూ. 219.54 కోట్ల మార్కును అందుకుంది.
అఫీషియల్గా ప్రకటించిన కరణ్ జోహార్
‘సింబా' విడుదలైన 15 రోజుల్లోనే రూ. 350 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన ధర్మప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కలెక్షన్స్ అఫీషియల్గా వెల్లడించారు.
ముగ్గురికీ ఇదే హయ్యెస్ట్
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, ధర్మ ప్రొడక్షన్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూడు సంస్థలకు ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమా కావడం విశేషం.
సౌత్ రీమేక్స్తో వరుస హిట్స్
దర్శకుడు రోహిత్ శెట్టి సౌత్ సినిమాలు రీమేక్ చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాయి. ఇప్పటికే ఆయన రీమేక్ చేసిన సింగం, సింగం రిటర్స్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకోగా... తాజాగా టెంపర్ రీమక్ ‘సింబా' రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది.
కలిసొచ్చిన హాలిడేస్
‘సింబా' చిత్రానికి క్రిస్మస్, న్యూఇయర్ హాలిడేస్, పొంగల్ హాలిడేస్ కూడా కలిసి రావడం, పెద్ద హీరోల సినిమాలు పోటీలో లేక పోవడంతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. త్వరలోనే ఈ మూవీ రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.