Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాక్సాఫీస్ను రఫాడిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్.. సాయిధరమ్ తేజ్ మూవీ రికార్డు కలెక్షన్లు
లాక్డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం బాక్సాఫీస్ను రఫాడించింది. తెలంగాణ, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీ చోట అంచనాలు మించి వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం కలెక్షన్లు ఇలా నమోదయయ్యాయి. ఈ సినిమా రెండో రోజు కూడా భారీగా కలెక్షన్లు నమోదుచేసే అవకాశం ఉందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. తొలి రోజు ఎంత గ్రాస్ సాధించిందంటే...
ఇండస్ట్రీకి జోష్ పెంచిన సాయితేజ్ మూవీ
కరోనావైరస్ కారణంగా మూతపడిన సినిమా పరిశ్రమకు ఊతం అందించేలా, ప్రేక్షకులను థియేటర్లకు ప్రేక్షకులకు పరుగులు పెట్టించడంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం సక్సెస్ అయింది. రిలీజైన ప్రతీ సెంటర్లోని హౌస్ ఫుల్ కలెక్షన్లు రావడం సినీ పరిశ్రమకు జోష్ను పెంచింది.
నైజాంలో భారీ కలెక్షన్లు
ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి నైజాంలో ఎదురు లేకుండా పోయింది. ఈ చిత్రం రూ.1.84 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో మరోసారి మెగా హీరోలకు నైజాం పెట్టని కోట అనే మాటను రుజువు చేసింది.
ఆంధ్రాలో కలెక్షన్ కింగ్
ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. ఉత్తరాంధ్ర 57 లక్షలు, గుంటూరు 43 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 34 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 25 లక్షలు, కృష్ణా జిల్లాలో 21 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.20 లక్షల వసూలు చేసింది.
సీడెడ్తోపాటు తెలుగు రాష్ట్రాల్లో
ఇక సీడెడ్లో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం 86 లక్షల రూపాయలు వసూలు చేయడం విశేషం. ఇక ఆంధ్రా, నైజాం, సీడెడ్లో కలిపి ఈ చిత్రం రూ.4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం రికార్డుగా చెప్పుకొంటున్నారు.
50 శాతం అక్యుపెన్సీతోనే రికార్డు వసూళ్లు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన ఆంక్షల ప్రకారం 50 శాతం అక్యుపెన్సీతో ప్రదర్శించినప్పటికీ సాయిధరమ్ తేజ్ మూవీ 4 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడంపై సినీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.