Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'శ్రీరామ రాజ్యం' కలెక్షన్స్ మరీ...
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం మంచి ఓపెనింగ్స్ తో విడుదలైనా రన్నింగ్ కలెక్షన్స్ మాత్రం డ్రాప్ అయ్యాయి. మూడో వారం వచ్చేసరికి చాలా ధియోటర్స్ నుండి తప్పుకోవటమే కాక కలెక్షన్స్ తగ్గిపోవటం స్పష్టంగా కనపడుతోంది. అన్ని మేజర్ సెంటర్స్ లోనూ దాదాపు డబ్బై నుంచి వంద శాతం వరకూ వారాంతరాల్లో తప్ప కలెక్షన్స్ డ్రాప్ కనిపిస్తోంది. శని,ఆదివారాల్లో కూడా యావరేజ్ గా కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఈ చిత్రం వారని పెద్దగా ఆకర్షించలేకపోయింది. మరో ప్రక్క ప్రస్తుతం తెలుగు సినిమాకు మహారాజ పోషకులైన యువత ఈ చిత్రం ఆడుతున్న ధియోటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక పంజా వచ్చాక ఈ కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయే అవకాసం ఉందని పరిశీలకులు అంటున్నారు.
పంజా చిత్రం ఈ నెల తొమ్మిదిన విడుదల అవుతోంది. ఇక ప్రమోషన్ ని కూడా నిర్మాతలు పెద్దగా చేయకపోవటం సినిమాను దెబ్బ తీసిందని అంటున్నారు. కేవలం సక్సెస్ మీట్ పెట్టి యువత చూడాలని పిలుపుని ఇచ్చినంత మాత్రాన సినిమాకు ఎవ్వరు వెళ్లతారని ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రమోట్ చేస్తే సినిమా నిలబడే అవకాశమున్నా ఆ దిశగా అడుగులు వెయ్యటం లేదని అభిమానులు భాధపడుతున్నారు. అయితే గత మూడు వారాలుగా శ్రీరామ రాజ్యం చిత్రం వీకెండ్ లలో వెళ్లే ప్యామిలీ ఫ్రేక్షకులుకు నెంబర్ వన్ ఛాయిస్ అనటంలో మాత్రం సందేహం లేదు.