twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీరామ రాజ్యం'చిత్రం కలెక్షన్స్ పొజీషన్?

    By Srikanya
    |

    బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో వచ్చిన పౌరాణిక చిత్రం శ్రీరామ రాజ్యం.ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తో విడుదైలైంది.దాదాపు చాలా చోట్ల 75 నుంచి 95 శాతం వరకూ సీట్స్ ఆక్యుపెన్సీ విడుదల రోజు జరిగింది.దాదాపు 32 కోట్ల బడ్జెట్ తో నిర్మింపబడ్డ ఈ చిత్రం మొదటి రోజు 5.14 వసూలు చేసింది.అయితే బాలకృష్ణ చిత్రాలతో పోలిస్తే ఇది పెద్ద మొత్తం కాకపోయినా ఓకే అనిపించుకుంది.అయితే ఆ హవా వీకెండ్ లో కూడా నడిచింది.

    ఫ్యామిలీలు ఈ చిత్రాన్ని చూడటానికి రావటం జరిగింది.అయితే కీలకమైన అంశం ఈ రోజు అంటే సోమవారం నుంచే అనేది నిజం.ఈ రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబడితే చిత్రం హిట్టైయినట్లే.ఇక ఈ చిత్రం ప్రమోషన్ ని కూడా నిర్మాతలు పెంచాలని నిర్ణయించారు.పౌరాణిక చిత్రం కాబట్టి యువతను పెద్దగా ఆకర్షించలేకపోతోందని ఎగ్జిబిటర్స్ అంటున్నారు.

    మరో ప్రక్క లవకుశతో పోల్చి చూసి పెదవి విరుస్తున్నారు కొంతమంది,ఆడియో వీక్ గా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అయినా బాపు,రమణల చిత్రం,బాలకృష్ణ ప్రధాన పాత్ర కావటం వాటిన్నటినీ దాటగలగుతోంది.ఈ వారాంతానకి కానీ ఈ సినిమా పొజీషన్ ఏమిటనేది ఖచ్చితంగా తెలియదు.సినిమా చూసిన వారంతా నయనతార పాత్రకే పట్టం కడుతున్నారు.సీతా దేవిగా ఆమె ఊహించని విధంగా,ఎవరూ వంకపెట్టలేని విధంగా ఇమిడిపోయిందని చెప్తున్నారు.

    English summary
    Sri Rama Rajyam got around 75 to 95 % occupancy in AP theaters, the movie which made with a budget of Rs. 32 Crore collected Rs. 5.14 Crore world wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X