Don't Miss!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
బాక్సాఫీస్ వద్ద సూయి ధాగా దూకుడు.. 50 కోట్లకు చేరువలో..
బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, అనుష్క శర్మ నటించిన సూయి ధాగా.. మేడిన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. రిలీజ్ రోజున రూ.8.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వారాంతంలో కూడా కలెక్షన్ల సత్తాను చూపించింది. శనివారం రూ.12.25 కోట్లు, ఆదివారం రూ.16.05 కోట్లు రాబట్టింది. దాంతో వారాంతంలో మొత్తంగా రూ.36.60 కోట్లు వసూలు చేసింది.
గతవారం రిలీజైన విశాల్ భరద్వాజ్ చిత్రం పటాకాను మించి వసూళ్లు రాబట్టడం విశేషం. అక్టోబర్ 2వ తేది గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్కు చేరువయ్యే అవకాశం ఉంది.
గుండెను పిండేసే విధంగా దర్శకుడు శరత్ కటారియా సూయి ధాగాను రూపొందించాడు. కుట్టు మిషన్ల అమ్మే షాపులో పనిచేసే సేల్స్ మెన్గా వరుణ్ ధావన్ నటించాడు. సాధారణ గృహిణిగా, వరుణ్ భార్య అనుష్క శర్మ కనిపిచింది. ఫ్యాషన్ దుస్తుల తయారీ చేసి గ్రామీణ యువకుడు జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు పొందాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఎన్నో భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఆకట్టుకొంటున్నాయి.