Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాక్ కు కలెక్షన్స్ కి కొంచెం కూడా సంభందం లేదు
హైదరాబాద్ : స్టార్ హీరోలతో మాస్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతూంటారు. ఎందుకంటే ఓపినింగ్స్ లో,మొదటి వీకెండ్ మూడు రోజులలోనే కలెక్షన్స్ పట్టేయవచ్చు అనేది వారి ఆలోచన. అదే చాలా సార్లు నిజమవుతూంటుంది. ఎక్కువ థియోటర్స్ లో విడుదల అయినప్పుడు టాక్ తో సంభంధం లేకుండా మొదటి మూడు రోజులూ జనం వస్తూంటారు. అదే ఇప్పుడు 'సికిందర్' కి ప్లస్ అయ్యిందని సమాచారం.
సూర్య హీరోగా నటించిన చిత్రం 'సికిందర్'. తమిళంలో 'అంజాన్'గా విడుదల అయ్యింది. సమంత హీరోయిన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేసారు. సినిమా మార్నింగ్ షో కే దారుణంగా ఉందంటూ టాక్ వచ్చేసింది. అయినా మొదటి వీకెండ్ లలో కలెక్షన్స్ మాత్రం పెద్దగా దాని ఇంపాక్ట్ పడకపోవటం ప్లస్ అయ్యింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం...తెలుగు,తమిళ, మళయాళ వెర్షన్స్ కు గానూ 30ల కోట్లు వరకూ వసూలు అయ్యాయి.
సూర్య ఇందులో కృష్ణ, రాజుభాయ్ అని రెండు పాత్రలు చేశారు. ముంబై నేపథ్యంలో కథ జరుగుతుంది. కథ లో సూర్య, విద్యుత్ జమాల్ ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. విద్యుల్ జమాల్ ని కొందరు ఓ గొడవలో చంపేస్తారు. అప్పుడు తన స్నేహితుడు మరణానికి రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఫేక్ గా తన మరణాన్ని క్రియేట్ చేసుకుని రంగంలోకి దిగుతాడు. తర్వాత అతనికి తన స్నేహితుడు మరణం వెనక ఉన్న కొన్నిషాకింగ్ నిజాలు తెలుస్తాయి. అప్పుడేం చేసాడు..ఆ నిజాలేంటి అనేదే కథ.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ''సూర్య సినిమా అంటే యాక్షన్ హంగామానే. ఆయన శైలికి తగిన కథ ఇది. లింగుస్వామి కథను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకొంటుంది. సమంత ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తుంది. ఆమె గ్లామర్, నటన ప్రధాన ఆకర్షణ. సూర్య కెరీర్లో మరో మంచి చిత్రంగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.
విద్యుత్ జమ్వాల్, మనోజ్బాజ్పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చుతున్నారు.