twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా మరో రికార్డు.. దేశంలోనే టాప్ జాబితాలో చోటు.. కానీ ఇంకా ఎంత రాబట్టాలంటే

    |

    మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా చిత్రం మిశ్రమ ఫలితాలను రాబడుతున్నది. ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టగా, మిగితా రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో ఓ మోస్తారు ప్రభావాన్నే చూపింది. గత 13 రోజుల్లో భారీ వసూళ్లు సాధించనప్పటికీ.. ఇంకా లాభాల్లోకి చేరుకోలేకపోవడం పంపిణిదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సైరా ఎంత రాబట్టిందంటే..

    నైజాం, సీడెడ్‌లో పరిస్థితి ఇలా

    నైజాం, సీడెడ్‌లో పరిస్థితి ఇలా

    సైరా మూవీ నైజాంలో 28 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగితే.. ప్రస్తుతం రూ.31 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక సీడెడ్‌లో ఈ చిత్ర హక్కులు 20 కోట్లకు అమ్ముడుపోగా ప్రస్తుతం రూ.18.34 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఉత్తరాంధ్ర హక్కులు రూ.14.4 కోట్లకు అమ్మితే ప్రస్తుతం రూ.15.65 కోట్ల మేర వసూలు చేసింది.

    ఆంధ్రాలో తడబాటు

    ఆంధ్రాలో తడబాటు

    ఆంధ్రా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లా బిజినెస్ రూ.10.4 కోట్లు జరిగితే 9.22 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా (9.2 కోట్లు) 6.94 కోట్లు, గుంటూరు (రూ.11.2 కోట్ల) రూ.9.41 కోట్లు, క‌ష్ణా జిల్లాలో (రూ.7.25 కోట్లు) వసూలు చేసింది రూ.7.25 కోట్లు, నెల్లూరు (రూ.5.2 కోట్లు) రూ.4.19 కోట్లు వసూలు చేసింది. ఏపీ, నైజాంలో కలిపి మొత్తం రూ.106 కోట్ల మేర జరిగితే.. మొత్తంగా రూ.102.31 కోట్లు వచ్చాయి.

     ఇతర రాష్ట్రాల్లో

    ఇతర రాష్ట్రాల్లో

    తెలుగేతర రాష్ట్రాల్లో సైరా వసూళ్లు మిశ్రమంగా నమోదయ్యాయి. కర్ణాటక హక్కులు రూ.26.25 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.13.74 కోట్లు, తమిళనాడులో రూ.8 కోట్లకు గాను రూ.1.35 కోట్లకు వసూలు చేసింది. కేరళలో రూ.1.7 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా కేవలం రూ.72 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్‌లో18 కోట్లకు హక్కులను అమ్మితే ఇప్పటి వరకు 9.13 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా సైరా హక్కులు రూ.187.25 కోట్లకు అమ్ముడు పోగా, ఇప్పటి వరకు రూ.136.58 కోట్లు షేర్ (224.4 కోట్ల గ్రాస్) వసూలు చేశాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధికంగా వసూలు చేసిన చిత్రాల్లో ఒకటిగా సైరా నిలవడం గమనార్హం.

    2019లో టాప్ ఏడో చిత్రంగా

    2019లో టాప్ ఏడో చిత్రంగా

    ప్రస్తుత ఏడాదిలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం రూ.435 కోట్లు వసూలు చేస్తే.. హృతిక్ నటించిన వార్ చిత్రం కేవలం 13 రోజుల్లోనే రూ.410 కోట్లు రాబట్టింది. ఇక కబీర్ సింగ్ రూ.377 కోట్లు కలెక్ట్ చేసి మూడో స్థానంలో నిలువగా, మిషన్ మంగళ్ రూ.309 కోట్లు, భారత్ రూ.306 సంపాదించి ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇక సైరా రూ.225 కోట్లతో ఏడోస్థానంతో సరిపెట్టుకొన్నది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huge collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X