Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైరా ఊచకోత.. రెండో రోజూ ఉయ్యాలవాడ వీరుడి జోష్.. రికార్డు స్థాయి కలెక్షన్స్!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు వివరాలకు వస్తే..
రెండో రోజూ రేనాటి ఉయ్యాలవాడ వీరుడి జోష్
మొదటి రోజు టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ని రాబట్టి సత్తా చాటుకుంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఓవరాల్గా చూస్తే 53.72 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక అదే జోష్లో రెండో రోజులో అడుగుపెట్టిన సైరా మెగా అభిమానులను ఖుషీ చేసే మార్క్ కొట్టేసింది.
రెండు రోజుల్లోనే 100 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసింది సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైన సైరా.. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ వైపు వర్షం కురుస్తున్నా 'సైరా' థియేటర్స్ వైపే అడుగులు వేశారు ప్రేక్షకులు. దీంతో రెండో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని తెలిసింది. ఆఫ్లైన్ లెక్కలు కూడా తెలిస్తే ఈ ఫిగర్ మారే అవకాశం ఉంది.
హిందీ.. ఇతర రాష్ట్రాల్లో
తెలుగుతో పాటు హిందీ, ఇతర 3 భాషల్లోనూ సైరా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 2.5 కోట్ల రూపాయలు రాబట్టింది సైరా. ఓవర్సీస్లో 2.5 కోట్లు, వరల్డ్ వైడ్గా చూస్తే రెండో రోజు 15 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు ఇప్పటి దాకా అందిన రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.