Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
The Kashmir Files: రికార్డులు బద్దలు కొడుతూ సాగుతున్న కాశ్మీర్ ఫైల్స్..తొమ్మిదో రోజు అన్ని రోజుల కంటే ఎక్కువే!
అనుపమ్ ఖేర్ నటించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. కాశ్మీరీ పండిట్లపై తీసిన ఈ హృదయ విదారక చిత్రం మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే కాదు చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. మొదటి రోజే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రోజు రోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఇక ఈ సినిమా తొమ్మిదో రోజు కలెక్షన్లు ఎంత అనేది తెలుసుకుందాం.
విడుదల చేయలేక
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలలో నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో కరోనా కేసులు ఎక్కువ ఉండటంమే కాక ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో అప్పుడు విడుదల చేయకుండా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేశారు.
‘రాధే శ్యామ్'
అలా ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 11న విడుదల చేశారు. మార్చి 10న సూర్య నటించిన 'ఈటీ' సినిమా తెలుగు, తమిళం సహా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. అంతేకాక ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' సైతం పెద్ద ఎత్తున అదే రోజున విడుదలయింది. హిందీ సహా ఇండియాలో 2200 థియేటర్లలో రాధేశ్యామ్ విడుదలైంది. అయితే ఇంత పోటీ ఉన్నా సినిమా విడుదల చేయాలని భావించి అప్పటికి అందుకబాటులో ఉన్న విడుదల చేశారు.
9వ రోజు కూడా
ఇక ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. 600 స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్స్ లో ప్రదర్శితం అవుతోంది. 8వ రోజు ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును దాటేసింది. 9వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.24.80 కోట్లు వసూలు చేసింది. శనివారం వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమా 24.50 కోట్లు రాబట్టగా హోలీ రోజున 19.15 కోట్లు రాబట్టింది.
'ది కాశ్మీర్ ఫైల్స్' సిరీస్
ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ కలుపుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 140.95 కోట్లు రాబట్టింది. సినిమాకి లభిస్తున్న ఈ ప్రేమ చూస్తుంటే ఈ కలెక్షన్స్ మరింత ముందుకు వెళతాయని చెప్పవచ్చు.
సినిమాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నందున , ఈ సినిమా రెండవ వారాంతంలో 150 కోట్ల మార్క్ను దాటగలదని, పెద్ద విషయం కాదని చెబుతున్నారు. ఇక వివేక్ అగ్నిహోత్రి OTTలో 'ది కాశ్మీర్ ఫైల్స్'పై సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే, OTTలో కూడా 'ది కాశ్మీర్ ఫైల్స్' కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
కిటకిటలాడుతున్నాయి
సినిమా విడుదలైన శుక్రవారం నాడు 700 స్క్రీన్లపై విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' రెండు రోజుల తర్వాత 2000 స్క్రీన్లకు అంటే ఆదివారం నాటికి పెరిగింది. ప్రస్తుతానికి ఆ స్క్రీన్లకు 4000కి పెంచారు. ఈ సినిమా వసూళ్లు వరుసగా పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఈ సినిమా చూసేందుకు సినిమా హాళ్లు కిటకిటలాడుతున్నాయి. థియేటర్లు ఇప్పటికీ హౌస్ఫుల్గా నడుస్తున్నాయి.