ఏప్రిల్ఫస్ట్నుంచి షూటింగ్లు బంద్
వీడియోపైరసీపై రాష్ట్ర ప్రభుత్వ నిరక్ష్యవైఖరికి నిరసనగా ఏప్రిల్ ఒకటి నుంచిపదమూడు వరకు షూటింగ్లనునిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఏప్రిల్లో జరిగే ఆందోళనకార్యక్రమాల్లో పరిశ్రమకు సంబంధించినిర్మాతలు, ఫైనాన్షియర్లు దగ్గర నుంచి లైట్బాయ్స్వరకు అందరూ పాల్గొంటారని నిర్మాతలమండలిఅధ్యక్షడు కెఎస్ రామారావు మంగళవారం రాత్రి ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు.సమ్మెలు, రాస్తారోకోలు, దర్నాలు చేస్తామన్నారు.వీడియో పైరసీ చట్టాన్నిఇంకా తేకపోవడమే గాక సినిమాపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలుతీసుకోవడం లేదని ఆయనవిమర్శించారు. ఉద్యమం ఎలా జరగాలన్నదానిపై ఈ నెల 13 న పరిశ్రమకు చెందినఅన్ని విభాగాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయంతీసుకుంటారని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











