Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ 'అ ఆ' : రిలీజ్ సంక్రాంతికి కాదు ...మరి?
హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'అ ఆ' టైటిల్ తో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక. సమంత హీరోయిన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్లానింగ్ ప్రకారమే నితిన్ త్రివిక్రమ్ లు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అ..ఆ మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు.
అలాగే చిత్రాన్ని వచ్చే జనవరి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించామని ప్రకటించారు. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి.... ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి జనవరికల్లా సినిమాని ఫినిష్ చేసి లవర్స్ డే కానుకగా ప్రేమికుల రోజున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్'తో పేరు సంపాదించింది అనుపమ.
నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్, ఛాయాగ్రహణం: నటరాజ్ సుబ్రమణియన్, కళ: రాజీవన్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్ డిజైనింగ్: విష్ణుగోవింద్, శ్రీశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.