Don't Miss!
- News Telangana Governor: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్-తమిళి సై రాజీనామా ఆమోదం..!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఉత్తమ విలన్ :40 కోట్లు అప్పు, 2 కోట్లు నష్టం
హైదరాబాద్ : కొన్ని సినిమాలు నిర్మాణంలో ఎంత సంచలనం సృష్టిస్తాయో...రిలీజ్ సమయంలోనే రకరకాల కారణాలుతో ఆగిపోయి...మరింత సంచలన క్రియేట్ చేస్తాయి. కమల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఉత్తమవిలన్ కు అదే పరిస్ధితి ఎదురయ్యింది. ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదల కావాల్సింది. ఆర్ధిక కారణాలతో ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు అవన్నీ పరిష్కరించుకుని నిన్న(శనివారం)సాయింత్రం విడుదలైంది. తమిళ,తెలుగు వెర్షన్ రెండింటికి అదే సమస్య వచ్చింది. ఈ విషయమై తెలుగు వెర్షన్ రిలీజ్ చేసిన నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ...తమిళ డబ్బింగ్ లు తీసుకునేవారికి ఇది ఓ గుణపాఠం అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ రోజు నాటికి 40 కోట్లు అప్పు ఉంది. దాంతో ఫైనాన్సర్స్ రిలీజ్ చేయటానికి అంగీకరించలేదు. చివరి నిముషాల్లో నిర్మాత లింగు స్వామి అప్పు గురించి బయిటపెట్టారు.దాంతో వెంటనే తమిళ నిర్మాతల మండలి , సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, శరత్ కుమార్(సౌత్ ఇండియా మూవీ ఆర్టిస్ట్స్ అశోశియేషన్) కలిసి పనిచేసి ఈ సమస్య నుంచి సినిమాని బయిటపడేసే ప్రయత్నం చేసారు. చివరకు కమల్ ..మరో సినిమాని లింగు స్వామి కు చేసేలా ఎగ్రిమెంట్ కుదుర్చుకుని సినిమాని బయటు తీసుకు వచ్చారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ... నేను తెలుగు రైట్స్ తీసుకునేటప్పుడు ఈ అప్పులు గురించి తెలియదు .. శుక్రవారం రిలీజ్ ఆగటం వల్ల ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది.
నటుడు కమలహాసన్, దివంగత దర్శకుడు కె.బాలచందర్, పూజాకుమార్, ఆండ్రియా నటించిన చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని లింగుసామి తిరుపతి పిక్చర్స్, కమల్హాసన్ రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు.
మొదట్లో ఉత్తమ విలన్ మే ఒకటవ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారమే తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడులో చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల సొమ్మును థియేటర్ల యజమానులు తిరిగి చెల్లించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడమే చిత్రం విడుదలలో చిక్కులు ఏర్పడినట్లు సమాచారం.
ఇలావుండగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్కుమార్, లింగుసామి శనివారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలన్ చిత్రానికి వ్యాపార రీత్యా ఏర్పడిన కొన్ని సమస్యలతో విడుదలకు జాప్యం జరిగిందన్నారు.చిత్రం విడుదలలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. చిత్రం విడుదలలో జాప్యానికి లింగుసామి క్షమాపణ కోరారు. 27 గంటల చర్చల తర్వాత ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు.