Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆరవ రోజు 'వెంకీమామ' పర్ఫార్మెన్స్.. ఎంత రాబట్టిందంటే!
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'వెంకీమామ'. డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోంది. చిత్రంలో వెంకీ, నాగచైతన్య అభినయం ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. ఆ సినిమా కలెక్షన్ వివరాలు చూస్తే..
మొదటి రోజు నుంచే డీసెంట్గా
'వెంకీమామ' సినిమా మొదటి రోజు నుంచే డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. తొలి ఈ వీకెండ్లో కుమ్మేసిన ఈ సినిమా రెండో వీక్ లోనూ డీసెంట్ రిపోర్ట్స్ అందిస్తోంది. నిన్నటితో విజయవంతంగా ఆరు రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చేత భేష్ అనిపించుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు..
6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటికి పైగా వసూలు చేసింది 'వెంకీమామ' సినిమా. డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తూ లాభాల దిశగా అడుగులేస్తోంది. ఈ వర్కింగ్ డేస్ ఇలాగే కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ దాటేసి వీకెండ్లో లాభాల్లోకి వెళ్లే అవకాశముందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
వెంకీమామ ఏరియావైజ్ రిపోర్ట్
ఇక 6వ రోజు వెంకీమామ ఏరియావైజ్ రిపోర్ట్ చూస్తే.. నైజాంలో 38 లక్షలు, సీడెడ్ లో 13 లక్షలు, ఉత్తరాంధ్రలో 21 లక్షలు, గుంటూరులో 6.2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 8.2 లక్షలు, వెస్ట్ గోదావరిలో 5 లక్షలు, కృష్ణాలో 5.4 లక్షలు, నెల్లూరులో 3 లక్షలు రాబట్టింది వెంకీమామ. మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో కలిపి 1 కోటి రూపాయలు వసూలు చేసింది వెంకీమామ మూవీ.
బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే..
వెంకీమామ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే 34 కోట్ల రేంజ్లో షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటి 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7 కోట్లమేర షేర్ రాబడితే వెంకీమామ సేఫ్ జోన్లో పడినట్లే.
అక్కినేని, దగ్గుబాటి అభిమానుల ఆనందం
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. ఈ సినిమా రిసల్ట్ చూసి అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.