Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కుమ్మేస్తున్న వెంకీమామ.. తొలివారం పూర్తి.. రికవరీ ఎంతంటే..
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి ఈ వీకెండ్లో కుమ్మేసిన వెంకీమామ.. విజయవంతంగా వారం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా షేర్..
విడుదలైన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్బస్టర్ అనిపించుకుంది వెంకీమామ. చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. పోటీకి వేరే పెద్ద సినిమా ఏదీ లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అలా వారం పూర్తిచేసుకున్న ఈ సినిమా మొత్తంగా 26.28 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ రిపోర్ట్..
నైజాంలో 8.61 కోట్లు, సీడెడ్ లో 3.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.2 కోట్లు, గుంటూరులో 1.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.06 కోట్లు, కృష్ణాలో 1.35 కోట్లు, నెల్లూరులో 0.80 కోట్లు రాబట్టింది వెంకీమామ. మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో కలిపి 26.28 షేర్, 43.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వెంకీమామ సినిమా.
రికవరీ ఎంతంటే..
మరోవైపు దేశంలోని మిగితా రాష్ట్రాలు, USAలో కూడా ‘వెంకీ మామ' జోష్ కొనసాగుతోంది. మొత్తంగా మొదటివారంలో వెంకీమామ కుమ్మేశాడనే చెప్పుకోవాలి. ఇప్పటిదాకా 81 శాతం రికవరీ సాధించారు ఈ మామఅల్లుళ్ళు. ఈ వారం కూడా ఇదే జోరు కొనసాగితే వెంకీమామ నిర్మాతలకు లాభాల పంట పండినట్లే మరి.
అక్కినేని, దగ్గుబాటి అభిమానుల ఉత్సాహం
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందింది 'వెంకీమామ' సినిమా. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. సినిమాకు అక్కినేని, దగ్గుబాటి అభిమానులు బ్రహ్మరథం పడుతుండటం పట్ల ఆనందంగా ఉన్నారు యూనిట్ సభ్యులు.