Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కుమ్మేసిన వెంకీమామ.. తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా?
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తొలి ఈ వీకెండ్లో ఈ సినిమా కుమ్ముడు చూస్తుంటే వెంకీమామ కిక్కేంటో తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..
|
వెంకీమామకు బాగా కలిసొచ్చిన అంశం
వెంకీమామ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ని ఓ ఊపు ఊపేస్తోంది. పోటీకి సరైన పెద్ద సినిమా లేకపోవడం వెంకీమామకు బాగా కలిసొస్తోంది. మొత్తానికి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా చూస్తే 45 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది వెంకీమామ మూవీ. ఈ మేరకు బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్బస్టర్ అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకీ మామ కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో 6.72 కోట్లు, సీడెడ్ లో 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.22 కోట్లు, గుంటూరులో 1.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.82 కోట్లు, కృష్ణాలో 1.04 కోట్లు, నెల్లూరులో 0.63 కోట్లు రాబట్టింది వెంకీమామ. మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో కలిపి 16.98 కోట్ల షేర్, 24.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వెంకీమామ మూవీ.
USA లో కూడా ‘వెంకీ మామ' జోష్..
మరోవైపు దేశంలోని మిగితా రాష్ట్రాలు, USA లో కూడా ‘వెంకీ మామ' జోష్ కొనసాగుతోంది. మొత్తంగా ఈ వీకెండ్ వెంకీ మామ కుమ్మేశాడనే చెప్పుకోవాలి. ఈ వారం కూడా ఇదే జోరు కొనసాగితే వెంకీ మామ నిర్మాతలకు లాభాల పంట పండినట్లే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అక్కినేని, దగ్గుబాటి అభిమానుల ఉత్సాహం
బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వెంకీమామ' సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. సినిమాకు అక్కినేని, దగ్గుబాటి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.