Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న యూరీ.. ఇప్పటికే 200% లాభం..సెన్సేషన్ హిట్!
బాలీవుడ్లో చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకొన్న సినిమా యూరీ: ది సర్జికల్ స్ట్రైక్. సంజూ ఫేం వికీ విశాల్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యకరమైన వసూళ్లను రాబడుతూ బ్లాక్బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం వారం రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
2019లో సెన్సేషనల్ హిట్గా
2019లో అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం ఓ రికార్డును అందుకొన్నది. ఈ చిత్రాన్ని రూ.28 కోట్ల బడ్జెట్తో రూపొందించగా ఇప్పటికే రూ.70 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.
వారం రోజుల కలెక్షన్లు ఇలా
జనవరి 11న రిలీజైన యూరీ.. చిత్రం మొదటి రోజు నుంచే బ్రహ్మండమైన వసూళ్లను సాధిస్తున్నది. శుక్రవారం రూ.8.20 కోట్లు, శనివారం రూ.12.43 కోట్లు, ఆదివారం రూ.15.10 కోట్లు, సోమవారం రూ.10.51 కోట్లు, మంగళవారం రూ.9.57 కోట్లు, బుధవారం రూ.7.73 కోట్లు, గురువారం రూ.7.40 కోట్లు వసూలు చేసింది.
భావోద్వేగమైన యూరీ కథ ఇదే
2016 సెప్టెంబర్ 29న భారతీయ నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఏడు ప్రదేశాల్లో చేపట్టిన మెరుపు దాడుల నేపథ్యంగా యూరీ: సర్జికల్ స్ట్రైక్స్ చిత్రం రూపొందింది. పాక్పై భారత సైన్య దాడులతో ఆర్మీ తన సత్తాను చాటింది. తెర మీద ఈ కథ భావోద్వేగాన్ని పండించే విధంగా ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వస్తున్నది.
నటీనటులు, సాంకేతిక విభాగాలు
దేశభక్తి, భావోద్వేగ కథతో రూపొందిన ఈ చిత్రంలో సంజూ ఫేం వికీ కుషాల్, పరేష్ రావల్, యామీ గౌతమీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రోని స్క్రీవ్వాలా నిర్మించగా, ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రానున్న రోజుల్లో భారీ చిత్రాల విడుదల లేకపోవడం వల్ల ఈ చిత్ర వసూళ్లకు ఎదురే లేదనే మాట వినిపిస్తున్నది.